Tanveer Ahmed On IND VS PAK: ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( womens Asia Cup 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 8 మ్యాచ్ లు పూర్తి కాగా.. ఇవాళ తొమ్మిదవ మ్యాచ్ టీమ్ ఇండియా మహిళల టీం వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) జట్ల మధ్య ఫైట్ జరిగింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ తొమ్మిదవ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి టీమిండియా, 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా… పాకిస్తాన్ జట్టును చిత్తు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లే ఆశలపై నీళ్లు చల్లింది టీమిండియా ఉమెన్స్ టీమ్.
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా శనివారం 8 గంటల ప్రాంతంలో దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తొమ్మిదవ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 18.1 ఓవర్లు ఆడింది పాకిస్తాన్. ఈ క్రమంలో 55 పరుగులు చేసి కుప్ప కూలింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా చాలా జాగ్రత్తగా చేదించి… పాకిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 8.4 ఓవర్లు ఆడిన టీమిండియా మహిళల టీం… మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులు అటు దీప్తి శర్మ 12 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించారు.
ఆసియా కప్ మహిళల టోర్నమెంట్ 2026 లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును టీమిండియా చిత్తు చేసింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రహస్యంగా AI చిప్స్ పెట్టారని.. అందుకే టీమిండియాకు అనుకూలంగా పిచ్ మారిపోయిందని బాంబు పేల్చారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ 55 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయిందని తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఐసీసీ చైర్మన్ జై షా.. మైదానంలోనే కూర్చొని ఈ పని చేశాడని హాట్ కామెంట్స్ చేశారు. లేకపోతే టీం ఇండియా పై పాకిస్తానే గెలిచేదని వ్యాఖ్యానించారు. టి20 లలో మహిళల టీం ఇండియన్ ఓడించడం చాలా సులభం… కానీ ఫిక్సింగ్ చేసి మరి ఇవాళ మ్యాచ్ గెలిచారని ఫైర్ అయ్యారు. అంపైర్లను కొనుగోలు చేశారని…పిచ్ మార్చేసి కుట్రలకు తెర లేపినట్లు ఫైర్ అయ్యారు.