Indian Cricketers : సాధారణంగా క్రికెటర్లు అయినా మామూలు వ్యక్తులు అయినా కొందరూ ఆల్కహాల్ సేవిస్తే.. గొంతుకు ఆనే వరకు తాగుతుంటారు. కొంత మంది మద్యం సేవిస్తే.. ఏం మాట్లాడుతారో, ఎలా వ్యవహరిస్తారో ఊహించడమే కష్టం. కొందరూ మాత్రం ఎంత తాగినా కానీ తాగనట్టే ఉంటారు. ఇలా టీమిండియా క్రికెటర్లలో కూడా కొంత మంది పచ్చి తాగుబోతులు ఉన్నారు. వారు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : SRH Team Maldives trip : కలసి ఉంటే కలదు సుఖం… తెలుగు హీరో అయిపోయిన ప్యాట్ కమిన్స్
టీమిండియా క్రికెటర్లలో మోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కే.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, యజువేందర్ చాహల్, అర్ష్ దీప్ సింగ్ వంటి క్రికెటర్స్ ఎక్కువగా మద్యం సేవిస్తుంటారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా క్రికెర్లలో అసలు డ్రింక్ చేసే వారు ఎవరు..? డ్రింక్ చేయని వారు ఎవ్వరూ అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుండటంతో ఆయా టీమ్ ల ఫేవరేట్ క్రికెటర్లు డ్రింక్ చేస్తారా..? లేదా అని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వీరిలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఎం.ఎస్. ధోనీ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి వంటి క్రీకెటర్లు మాత్రం డ్రింక్ చేయరట. ఇక మిగతా క్రికెటర్లు దాదాపు అందరూ కూడా బాగానే డ్రింక్ చేస్తుంటారని సమాచారం.
ఇక ఈ ఏడాది ఐపీఎల్ టీమ్ లను పరిశీలించినట్టయితే అసలు డ్రింక్ కూడా చేయని విరాట్ కోహ్లీ, ఎం.ఎస్. ధోనీ టీమ్ లను పరిశీలించినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి స్థానంలో కొనసాగితే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు జట్టు 10 మ్యాచ్ లు ఆడితే వాటిలో ఏడింటిలో విజయం సాధించి 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానమైన పదో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు 10 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ ముంబై రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబై విజయం సాధిస్తే.. మొదటి స్థానంలో ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం స్థానాలు ఏవి కూడా మారవు.
ఈ సారి ఐపీఎల్ సీజన్ లో టీమిండియా క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, అతిపిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ, పంజాబ్ ఓపెనర్స్ ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్ వంటి క్రీడాకారులు ఈ సీజన్ లో తమ సత్తా చాటుతున్నారు. బౌలింగ్ లో ప్రసిద్ కృష్ణ టీమిండియా ఆటగాళ్లలో కాస్త ముందంజలో ఉన్నారు. అయితే ఇక మొత్తానికి ఈ టీమిండియా క్రికెటర్లు తాగుబోతులా అని నెటిజన్లు చర్చించుకోవడం గమనార్హం.
?igsh=MXZxN202cmU2ZnBxOA==