Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) ప్రాణాలకే ముప్పు ఉంటుందని కొంత మంది అంటున్నారు. పాకిస్థాన్ వెళ్లొద్దు అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. టీమిండియా కోసం పాకిస్థాన్ లో అడుగు పెడితే.. ఏదైనా జరిగితే.. ఎవరూ రెస్పాన్స్ అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరునంలోనే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లొద్దు అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే… ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహిస్తున్నారు. దీంతో టీమిండియా ( Team India) మ్యాచ్లను తటస్థ వేదికపైనే ఆడనుంది.
Also Read: Tilak Varma – Vijay Devarkonda: టాలీవుడ్ హీరోతో తిలక్ వర్మ.. విదేశాల్లో చిల్ !
కానీ…ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) నేపథ్యంలో… పాకిస్థాన్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్లాల్సి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఈ సారి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) ఆథిత్యం ఇస్తోంది. ఈ తరుణంలోనే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( Champions Trophy 2025 ) కోసం గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ). ఇక ఈ ఓపెనింగ్ సెర్మనికీ అన్ని జట్లు కెప్టెన్లు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఒక వేళ ఇదే జరిగితే… అది సంచలనమే అవుతుంది. అన్ని జట్ల కెప్టెన్లందరూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో పాల్గొనాలి, ఇది ICC ఈవెంట్లకు ప్రామాణిక పద్ధతి. కచ్చితంగా అందరూ హాజరుకావాల్సి ఉంటుంది. దాదాపు “29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్లో మెగా అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్ జరుగుతోంది. కాబట్టి గ్రాండ్ నిర్వహించాలని పాక్ ప్లాన్ చేస్తోంది. కానీ…ఇండియా ( India), పాకిస్తాన్ ( Pakisthan) మధ్య వివాదాల కారణంగా… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అక్కడి వెళ్లడం కష్టమేనని అంటున్నారు.
కానీ మరికొందరు వెళ్లాల్సిందే అని చెబుతున్నారు. దీనిపై భారత సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే…పాకిస్థాన్ వెళితే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్లకుంటే.. ఓపెనింగ్ సెర్మనీ ఆగిపోతుందా.. అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: Kho Kho World Cup 2025: దుమ్ములేపుతున్న ఇండియా.. 3 మ్యాచుల్లో విక్టరీ!
కాగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( Champions Trophy 2025 ), ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. 1996 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత మళ్లీ ఇప్పుడు మొదటి ప్రధాన ICC టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ ఫార్మాట్లో జరుగనుంది. కొన్ని మ్యాచ్లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది, ఇండియా ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లు, మొదటి సెమీ-ఫైనల్ దుబాయ్లో జరుగుతాయి. ఒకవేళ భారత్ ఫైనల్కు అర్హత సాధిస్తే, అది కూడా దుబాయ్కి తరలిస్తారు. లేకపోతే, లాహోర్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుంది. ఎనిమిది జట్ల ఈవెంట్లో ఆతిథ్య పాకిస్థాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పాల్గొంటాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఎన్కౌంటర్ ఫిబ్రవరి 23న దుబాయ్లో జరగనుంది.