Javed Miandad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40 శాతం మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకు జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ పడగొట్టలేదు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న బుమ్రా ఐదు మ్యాచ్ లలో ఒక్క వికెట్ పడగొట్టకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ ( Javed Miandad ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సాహిబ్జాదా ఫర్హాన్ సిక్సర్లు కొట్టడం వల్ల బుమ్రా కెరీర్ ముగిసిపోయిందని జావేద్ మియాందాద్ బాంబు పేల్చాడు. సాహిబ్జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) ఇచ్చిన ట్రీట్మెంట్ నుంచి బుమ్రా ( Bumrah) కోలుకోవడం లేదని.. అందుకే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక విఫలమవుతున్నాడని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక బుమ్రా రిటైర్మెంట్ ఇస్తే బెటర్ అంటూ చురకలు అంటించారు. అయితే, బుమ్రాపై జావేద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం కౌంటర్ ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా అదరగొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
Also Read: Blessing Muzarabani: నఖ్వీకి చిప్పు దొబ్బిందా ? బ్యాన్ లేదు బొంగు లేదు, PSL కాలి గోటితో సమానం
పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్… గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లీ కంటే అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా కూడా డేంజర్ బౌలర్ బుమ్రాకు చుక్కలు చూపించాడు. అతని బౌలింగ్ లో కూడా సిక్సర్లు కొట్టి ఇరగదీశాడు ఫర్హాన్. అప్పటి నుంచి ఫర్హాన్ ఓవర్ గా రియాక్ట్ అవుతూ బుమ్రా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆసియా కప్ 2025 ( Asia Cup 2026 ) సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో ఫర్హాన్ ( Sahibzada Farhan) సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ ( Javed Miandad ) సంచలనం వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి బుమ్రా కెరీర్ నాశనమైందని బాంబు పేల్చారు. ఇక బుమ్రా కోలుకోవడం చాలా కష్టమని కుండబద్దలు కొట్టి చెప్పారు. పాకిస్తాన్ ప్లేయర్లతో పెట్టుకుంటే ఎవరైనా మట్టిలో కలవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫర్హాన్ దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) కూడా వికెట్లు సాధించలేక సతమతమవుతున్నాడని బుమ్రా పరువు తీశాడు. ఇలాంటి నేపథ్యంలో బుమ్రా రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటర్ అని సూచనలు చేశారు. దీంతో జావేద్ మియాందాద్ ( Javed Miandad ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.