Javed Miandad: ట్రై సిరీస్ నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్లతో గొడవపడ్డ 15 ఏళ్ల టీమిండియా క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ( VAIBHAV SURYAVANSHI) గురించే సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వైభవ్ ను టార్గెట్ చేసి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. శ్రీలంక క్రికెటర్లతో జరిగిన గొడవలో వైభవ్ సూర్యవంశీదే 100కు 200% తప్పు ఉందని కారు కూతలు కూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ ( Javed Miandad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ వయసు ( VAIBHAV SURYAVANSHI Age) 15 సంవత్సరాలు కాదని.. వాడు 25 సంవత్సరాలు కచ్చితంగా ఉంటాడని శపథం చేశారు. అందరినీ ఫూల్స్ చేసి.. క్రికెట్ ఆడుతున్నాడని ఆరోపణలు చేశారు. ఐపీఎల్ లో తప్ప, ఈ బుడ్డోడు ఎక్కడ పనికిరాడు అని కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో జావేద్ మియాందాద్ ( Javed Miandad) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైన అనేక కుట్రలు సాగుతున్నాయి. ఐపీఎల్ లో మొన్నటి వరకు అదరగొట్టిన వైభవ్ వయసు పై విమర్శలు చేసిన పాకిస్తాన్ మాజీలు… ఇప్పుడు శ్రీలంక ట్రై సిరీస్ లో గొడవకు దిగిన వైభవ్ కు క్యారెక్టర్ లేదంటూ కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ ( Javed Miandad) సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ సూర్యవంశీ ఐపీఎల్ టోర్నమెంట్ కు తప్ప అంతర్జాతీయ క్రికెట్ కు పనికిరాడని బాంబు పేల్చారు. ఇండియాలో ఉన్న ఫ్లాట్ పిచ్ ల పైన మాత్రమే వైభవ్ సిక్సర్లు అలాగే బౌండరీలు కొడతారని ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం లిస్ట్ ఏ క్రికెట్ లో మాత్రం వైభవ్ సూర్యవంశీ స్ట్రగుల్ అవుతున్నట్లు వెల్లడించారు. భారీ స్కోరులు చేయడంలో విఫలమవుతున్న వైభవ్… ఒత్తిడికి లోనై, క్రికెటర్లతో గొడవకు దిగుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అతని వయస్సు విషయంలో మొదటి నుంచి తనకు అనుమానాలు ఉన్నాయని జావేద్ ఆరోపణలు చేశారు. అతని వయసు 15 సంవత్సరాలు కాదని… 25 సంవత్సరాలు ఉంటుందని బాంబు పేల్చారు. అతనికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని వెల్లడించారు. ఆ దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అడుగులు వేయాలని కోరారు జావేద్ మియాందాద్ ( Javed Miandad). దీంతో జావేద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే అతడు చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు.