E-Paper
Advertisement

Syed Mushtaq Ali Trophy 2025: ఇషాన్ భ‌యంక‌ర‌మైన‌ సెంచ‌రీ..సయ్యద్‌ ముస్తాక్‌ అలీ 2025 ట్రోఫీ విజేత‌గా జార్ఖండ్

Syed Mushtaq Ali Trophy 2025: ఇషాన్ భ‌యంక‌ర‌మైన‌ సెంచ‌రీ..సయ్యద్‌ ముస్తాక్‌ అలీ 2025 ట్రోఫీ విజేత‌గా జార్ఖండ్
Advertisement

Syed Mushtaq Ali Trophy 2025:  సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Syed Mushtaq Ali Trophy Elite 2025 ) విజేతగా అందరూ ఊహించినట్లుగానే ఝార్ఖండ్ ( Jharkhand ) నిలిచింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో ఏకంగా 69 పరుగుల తేడాతో విజయం సాధించిన జార్ఖండ్ టైటిల్ గెల్చుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ హర్యానా వర్సెస్ ఝార్ఖండ్ ( Haryana vs Jharkhand, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. 49 బంతుల్లోనే 101 పరుగులు సాధించిన కెప్టెన్ ఈశాన్ కిషన్, జట్టును ముందుండి నడిపించాడు. ఇక జార్ఖండ్ విధించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దారుణంగా విఫలమైన హర్యానా, 20 ఓవర్లు ఆడకముందే ఓటమి చవి చూసింది. ఛేద‌న‌లో 18.3 ఓవ‌ర్లు ఆడిన హ‌ర్యానా టీం, 193 ప‌రుగులు సాధించి ఆలౌట్ అయింది. ఈ దెబ్బకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ 2025 టోర్నమెంట్ ఝార్ఖండ్ వశం అయింది. ఇక ఈ ట్రోఫీని ఈశాన్ కిషన్ అందుకొని సంబరాలు చేసుకుంటోంది జార్ఖండ్ టీం.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

సూపర్ సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్

Advertisement

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ హర్యానా వర్సెస్ ఝార్ఖండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన జార్ఖండ్ 262 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో కేవలం మూడు అంటే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది జార్ఖండ్. ఈ ఇన్నింగ్స్ లో ఈశాన్ కిషన్ 49 బంతుల్లో సెంచరీ నమోదు చేయగా, కుశగ్రా 81 పరుగులతో రెచ్చిపోయాడు. అలాగే అకుల్ రాయ్ 20 బంతుల్లో 40 పరుగులు చేయగా రాబిన్ మింజ్ 31 పరుగులతో రఫ్పాడించాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో హర్యానా అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఛేద‌న‌లో 18.3 ఓవ‌ర్లు ఆడిన హ‌ర్యానా టీం, 193 ప‌రుగులు సాధించి ఆలౌట్ అయింది.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

జార్ఖండ్ కు వచ్చే ప్రైజ్ మనీ ఎంత అంటే?

Advertisement

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా గెలిచిన జార్ఖండ్ జట్టుకు భారీ ప్రైజ్ మనీ రానుంది. ముందుగా బీసీసీఐ ప్రకటించిన దాని ప్రకారం ఝార్ఖండ్ జట్టుకు 80 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇంకా ఫైనల్స్ లో ఓడిపోయిన హర్యానా జట్టుకు 40 లక్షల రూపాయలు దక్కనుంది. గత సీజన్ లో బీసీసీఐ ఇచ్చిన రూ.80 ల‌క్ష‌ల‌తో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా రూ.80 లక్ష‌ల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. దీంతో గతంలో విజేతగా నిలిచిన ముంబై జట్టుకు ప్రైజ్ మనీ మొత్తం 1.6 కోట్ల రూపాయలు వచ్చాయి.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×