Kapil Dev: ఇంగ్లాండ్, ఐర్లాండ్ టి20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి… శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ఇక పైన టీమిండియా టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కొనసాగనున్నాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడు. వైభవ్ సూర్య వంశీకి కూడా ఛాన్స్ దక్కింది. అయితే భువనేశ్వర్ లాంటి అద్భుతమైన బౌలర్ కు అవకాశం రాకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్ అయ్యారు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా కంటే భువనేశ్వర్ 10 రెట్లు బెటర్ అని…. అలాంటి వాడిని ఎందుకు సెలెక్ట్ చేయలేదని నిలదీశారు. ఆసుపత్రి బెడ్ పైన పడుకున్న వాడికి కూడా నేరుగా టీమిండియాలోకి అవకాశం ఇస్తే.. భువనేశ్వర్ కుమార్ గడ్డి పీకలా? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు కపిల్ దేవ్. దీంతో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
టీమిండియా టి20 జట్టును తాజాగా బిసిసిఐ ప్రకటించిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ తీసుకువచ్చినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ కు నిరాశ ఎదురైందని సీరియస్ అయ్యారు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టును బాగానే నడిపించే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ సూర్యను తప్పించడం మాత్రం తనకు నచ్చలేదన్నారు. వైభవ్ సూర్య వంశీకి మరికొన్ని రోజులు సమయం ఇస్తే బాగుండని వెల్లడించారు. ఇప్పుడే అతడి పై ఒత్తిడి పెడితే, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా హర్షిత్ రాణాను నేరుగా టీమిండియా జట్టు కోసం సెలెక్ట్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కపిల్ దేవ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించిన నకుల్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను సెలెక్ట్ చేయకపోవడం దిక్కుమాలిన చర్య అంటూ ఫైర్ అయ్యారు.
అదిరిపోయే ఆటగాడు భువనేశ్వర్ అని.. కచ్చితంగా వికెట్లు పడగొట్టే సత్తా ఉన్నవాడు అంటూ వ్యాఖ్యానించారు. టీమిండియా తుది జట్టులోకి తీసుకోకపోయినా… 15 మంది సభ్యుల జట్టులో అయినా భువనేశ్వర్ కుమార్ ను తీసుకుంటే బాగుండేదన్నారు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా కంటే 10 రెట్లు భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్ అంటూ కితాబ్ ఇచ్చారు. అనవసరంగా భువనేశ్వర్ కెరీర్ నాశనం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీంతో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గౌతమ్ గంభీర్ కారణం వల్లనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్న వాళ్లకు చాన్సులు రావడంలేదని అటు క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ పైన ఉన్న కోపంతో గౌతమ్ గంభీర్ ఈ స్కెచ్ వేశాడని సీరియస్ అవుతున్నారు.