E-Paper
Advertisement

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి
Advertisement

Shoaib Akhtar On IND VS PAK:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన రోజు జనాలందరూ ఇంట్లోనే కూర్చుంటారు. టీవీలకు అతుక్కుపోతారు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లలో మాత్రమే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహించాలని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ బతకాలంటే… ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సిందేనని వివరించారు. అప్పుడే ఐసీసీకి (ICC) కూడా లాభాలు వస్తాయన్నారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహించాలని చాలామంది డిమాండ్లు చేస్తున్నారు. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రియాక్ట్ అయ్యారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితే చూడాలని తనకు కూడా ఉందన్నారు. ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగితే ఇంకా బాగుంటుందని వెల్లడించారు.

దుబాయ్ వేదికగా మ్యాచులు నిర్వహిస్తే… బెటర్ అన్నారు. అప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతాయని వివరించారు. దీనికోసం ఐసీసీ కృషి చేయాలని కోరారు. ప్రపంచ కప్ లు ఎన్ని నిర్వహించినా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ల ముందు జుజుబీ అంటూ హేళన చేశారు. అందుకే వరల్డ్ కప్ లు నిర్వహించి టైం వేస్ట్ చేసుకోవడం కంటే… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ల కోసం ప్రయత్నాలు చేయాలని ఐసీసీకి సూచనలు చేశారు షోయబ్ అక్తర్.

అసలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు ఎందుకు జరగడం లేదు ?

Advertisement

2008 నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ఇండియాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసినందుకుగాను.. భారత సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ దేశంలో పర్యటనలు, వాళ్లతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకూడదని దిశా నిర్దేశం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా పాక్ ప్లేయర్లు ఉండకుండా బ్యాన్ విధించింది.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

Related News

టీమిండియాను వ‌దిలేసి, మ‌రో దేశానికి సంజు శాంస‌న్ ఆడితే బెట‌ర్‌

నిల‌క‌డ లేదు, 50 మ్యాచ్ ల‌కో మంచి ఇన్నింగ్స్ ఆడ‌తాడు..సంజుపై షాహిద్ అఫ్రిది వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఆ రోజున డ్రెస్సింగ్ రూంలో ధోని వెక్కి వెక్కి ఏడ్చాడు..చాహ‌ల్ సంచ‌ల‌నం

బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు…అత‌నికి ప్రసిద్ కృష్ణ స‌రైన జోడి

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ భారీ కుట్ర‌..4 జ‌ట్లుగా విడిపోయి మ‌రీ

నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారు, పాక్ బౌల‌ర్ క‌న్నీళ్లు

ఆ డ్రింక్ తాగి ఉమ్మేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ..కోహ్లీ ఫ్యాన్స్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×