Shahid Afridi on Sanju Samson: టీమిండియా కుర్ర క్రికెటర్ సంజు శాంసన్ (Sanju Samson ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటూ… జట్టుకు అవసరమైనప్పుడు అదిరిపోయో ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. ముఖ్యంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మూడు కీలక ఇన్నింగ్స్ లో ఆడి వరల్డ్ కప్ హీరో అయ్యాడు సంజు. అలాంటి సంజు శాంసన్ పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్ బ్యాటింగ్ లో నిలకడ లేదని.. 50 ఇన్నింగ్స్ లకోసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని పరువు తీశారు. ఒకే ఒక్క ఇన్నింగ్స్ బాగా ఆడటం కోసం 50 మ్యాచ్ లు వృథా చేస్తాడని బాంబు పేల్చాడు. ధోనిలా ఫీల్ అవ్వడం తప్ప, పీకిందేమీ లేదని హేళన చేశారు. దీంతో సంజుపై షాహిద్ అఫ్రిది వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
టీమిండియా తుది జట్టులో శాశ్వత స్థానం కోసం కొట్టుమిట్టాడుతున్న సంజు శాంసన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi). సంజు శాంసన్ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడని పేర్కొన్నారు. బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ అద్భుతంగా చేస్తాడని కొనియాడారు. కానీ ఒక్క మ్యాచ్ లో హిట్ అయ్యేందుకు… కనీసం 50 మ్యాచ్ లు వృధా చేస్తాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫామ్ కోల్పోతే… రెండు, మూడు నెలల పాటు టైం తీసుకుంటాడని బాంబు పేల్చాడు.
అందుకే భారత సెలక్టర్లు అతనిపై పెద్దగా ఫోకస్ చేయడం లేదని వివరించారు. స్థిరంగా ప్రతి మ్యాచ్ లో ఆడే కెపాసిటీ.. సంజు శాంసన్ కు లేదని హేళన చేశారు. సెలెక్టర్లను అతడు బోల్తా కొట్టించలేకపోతున్నాడని చురకలు అంటించారు. అందుకే అడపాదడపా అవకాశాలు వస్తున్నాయని వివరించారు. ఇలాగే సంజు శాంసన్ ఆడితే మాత్రం… అతనికి అవకాశాలు రావడం చాలా కష్టమన్నారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్లు.. సంజు స్థానాన్ని తన్నుకుపోవడం గ్యారంటీ అని హెచ్చరించారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi).
జింబాబ్వే పైన వరుసగా 3 టీ20 లు టీమిండిగా గెలిచిందంటే అనేక అనుమానాలు వస్తున్నట్లు షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ అలాగే జింబాబ్వే క్రికెట్ బోర్డు మధ్య రహస్య ఒప్పందం జరిగిందని… అందువల్లే టీం ఇండియా గెలిచిందని బాంబు పేల్చాడు. టీమిండియా గెలిచేలా జింబాబ్వే క్రికెట్ బోర్డ్ పనిచేస్తుందని వెల్లడించారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi).