Railway Jobs: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నిర్వహిస్తున్న టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తు ప్రక్రియ జూలై 29, 2026తో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను రైల్వే విభాగం భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక ఆర్ఆర్బీ అప్లికేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియలో 323 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 6,234 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు విద్యార్హతలు పోస్టు గ్రేడ్ను బట్టి మారుతాయి.
ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో బీఎస్సీ డిగ్రీ ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా బీఈ/బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగా పరిగణిస్తారు.
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్సీవీటీ/ఎస్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికెట్ లేదా సంబంధిత ట్రేడ్లో అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉండాలి. కొన్ని సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్తో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రేడ్ 3 ఉద్యోగాలకు గ్రాస్ సాలరీ రూ.30,000 వరకు ఉంటుంది. గ్రేడ్ 1 పోస్ట్లకు రూ.45,000 నుంచి రూ.52,000 వరకు గ్రాస్ సాలరీ ఉండొచ్చు.
ఈ నియామకానికి మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. మొదట అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాయాలి. ఆ పరీక్షలో పాస్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. చివరగా వైద్య పరీక్షలో అర్హత సాధించిన వారికి నియామకం కల్పిస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 90 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. అందువల్ల అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి.
Also Read: దోమలను చంపేందుకు కొత్త దోమలు.. 6 లక్షల స్పెషల్ దోమలు విడుదల
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30, 2026న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జూలై 29, 2026. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి జూలై 31, 2026 వరకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్ సవరణ విండో ఆగస్టు 1, 2026న ప్రారంభమవుతుంది. ఈ సవరణకు ఆగస్టు 10, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
అభ్యర్థులు ముందుగా అధికారిక ఆర్ఆర్బీ అప్లికేషన్ పోర్టల్ను సందర్శించాలి. అక్కడ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 లింక్ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలతో నమోదు పూర్తి చేయాలి. అనంతరం ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ను జాగ్రత్తగా నింపాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. చివరగా దరఖాస్తును సమర్పించి నిర్ధారణ పేజీని డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు గడువు జూలై 29తో ముగుస్తుంది. అందువల్ల అర్హత ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. చివరి రోజు సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ముందుగానే ప్రక్రియ పూర్తి చేయడం మంచిది. పరీక్షకు కూడా సమయానికి సిద్ధమైతే ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం