PCB Champions Cup : 2027 వన్డే వరల్డ్ కప్ (2027 World Cup) కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఇప్పటి నుంచి పని ప్రారంభించింది. పాకిస్తాన్ క్రికెటర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం… ఫిట్నెస్ కోసం స్పెషల్ ట్రైనింగ్… భారీ సిక్సర్లు కొట్టేలా అమెరికాలో కోచింగ్ లాంటివి ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే వన్డే ఫార్మాట్ లో క్రికెటర్లు అద్భుతంగా రాణించేందుకు గాను… మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఛాంపియన్స్ కప్ ( Champions Cup) పేరుతో మరో టోర్నమెంట్ కు నాంది పలికింది. ఇందులో పాకిస్తాన్ క్రికెట్ జట్టును నాలుగు గ్రూపులుగా విడదీసి… మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్ లో జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( PCB).
2027 వన్డే వరల్డ్ కప్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… వచ్చే నెలలో నేషనల్ ఛాంపియన్స్ కప్ పునః ప్రారంభించనుంది. ఆగస్టు 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంటే ఏడు రోజులపాటు మొత్తం ఏడు మ్యాచ్ లు నిర్వహించనుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఏడు మ్యాచ్ లు నిర్వహిస్తారు. మొత్తం నాలుగు టీమ్స్, సింగిల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడతాయి. టాప్ 2 జట్లు ఆగస్టు 18వ తేదీన ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.
పాకిస్తాన్ గ్రీన్, పాకిస్తాన్ వైట్, పాకిస్తాన్ బ్లూ, పాకిస్తాన్ గోల్డ్ పేరుతో నాలుగు జట్లు బరిలోకి దిగుతాయి. ఈ నాలుగు జట్ల మధ్య ఆగస్టు 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో అద్భుతంగా రాణించిన ప్లేయర్లను 2027 వన్డే వరల్డ్ కప్ కోసం తీసుకునే ఛాన్స్ లో ఉంటాయి.
2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం కంటే… ఆ టోర్నమెంటులో టీమిండి అని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అందుకే ఇప్పటి నుంచే ఈ టోర్నమెంట్ కోసం సిద్ధమవుతోంది. ఐసీసీ తాజాగా 2027 వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన కొత్త ఫార్మాట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఏకంగా మూడు మ్యాచ్ లు జరిగే ఛాన్సులు ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియాను ఓడించి ఇంటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకుని పాకిస్థాన్. అందుకే తమ క్రికెటర్లకు అన్ని రకాల శిక్షణ అందిస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం