Paytm Payments Bank Closure| చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పేటిఎం బ్యాంకింగ్ కార్యకలాపాల కేసులో మంగళవారం ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు జారీ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను మూసివేసేందుకు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. పేటిఎం బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. కోర్టు తీర్పు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల ముగింపులో చివరి దశగా మారింది. నాలుగేళ్లకు పైగా కొనసాగిన నియంత్రణ చర్యల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూలై 8 నుంచి జూలై 22 తేదీల్లో బ్యాంక్ మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949,.. కంపెనీల చట్టం, 2013 ప్రకారం కొనసాగుతుంది.
మాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ జనరల్ మేనేజర్ గిరికుమార్ ఎం. నాయర్ను అధికారిక లిక్విడేటర్గా హైకోర్టు నియమించింది. ఆయన బ్యాంక్ మూసివేత ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అలాగే బ్యాంక్ బోర్డు నిర్వహించే అన్ని అధికారాలను ఆయన చేపడతారు. జూలై 8, 2026 నుంచి ఆయన అధికారాలు అమల్లోకి వచ్చాయి.
2026 ఏప్రిల్ 24న ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 22(4) కింద ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాంక్ కార్యకలాపాలు బ్యాంక్, ఖాతాదారుల ప్రయోజనాలకు అనుకూలంగా లేవని ఆర్బీఐ పేర్కొంది. లైసెన్స్ రద్దు తర్వాత ఆర్బీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి బ్యాంక్ మూసివేతకు అనుమతి కోరింది.
Also Read: రైల్వే టెక్నీషియన్ జాబ్.. జూలై 29 లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు 2015లో పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ లభించింది. ఈ బ్యాంక్ మాతృక కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ ఆధారంగా పనిచేసింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణలో ఈ బ్యాంక్ కీలక పాత్ర పోషించింది. పేమెంట్స్ బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించగలవు, చెల్లింపు సేవలు అందించగలవు. కానీ సాధారణ బ్యాంకుల మాదిరిగా రుణాలు ఇవ్వలేవు.
2022 మార్చిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని ఆర్బీఐ నిషేధించింది. 2024 జనవరిలో ఆర్బీఐ మరిన్ని ఆంక్షలు విధించింది. కొత్త డిపాజిట్లు స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలు నిర్వహించడంపై పరిమితులు విధించింది.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూసివేతతో పేటీఎం యూపీఐ సేవలపై పెద్దగా ప్రభావం ఉండదు. వినియోగదారులు పేటీఎం యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు కొనసాగించవచ్చు.
పేటీఎం కంపెనీ.. యూపీఐ సేవలు ఇతర భాగస్వామ్య బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థల సహకారంతో కొనసాగుతాయి.
ఎన్పీసీఐ పేటీఎంకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా యూపీఐ సేవలు అందించేందుకు అనుమతి ఇచ్చింది. అందువల్ల వినియోగదారులు డబ్బులు పంపడం, స్వీకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వంటి సేవలను కొనసాగించవచ్చు. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు సాధారణ బ్యాంక్ ఖాతాల మాదిరిగా పనిచేయవు. వాలెట్. ఫాస్టాగ్ వినియోగదారులు కంపెనీ సూచనలను పాటించాల్సి ఉంటుంది.
Also Read: దోమలను చంపేందుకు కొత్త దోమలు.. 6 లక్షల స్పెషల్ దోమలు విడుదల