E-Paper
Advertisement

KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ

KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ

KL Rahul:  దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య విశాఖ వేదికగా జరిగిన మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ ఘోర అవమానం ఎదురయింది. టీమిండియా జ‌ట్టులోకి సీనియ‌ర్ ప్లేయ‌ర్ అయిన విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోవడం లేదు. టీమిండియాలో అతనికి విలువ లేనట్లే అని తెలుస్తోంది. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కె ఎల్ రాహుల్ కు సలహాలు ఇచ్చేందుకు విరాట్ కోహ్లీ దగ్గరికి వస్తే, అతన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు రాహుల్. చాలు..చాలు నువ్వు చెప్పింది చాలు అన్న రేంజ్ లో విరాట్ కోహ్లీ పరువు తీసాడు కేఎల్ రాహుల్. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

విరాట్ కోహ్లీని పట్టించుకోని టీమిండియా కెప్టెన్ రాహుల్

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన మూడవ వన్డేలో విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ కంటే దారుణంగా అవమానించాడు కేఎల్ రాహుల్. స్లిప్ లో మరొక పిల్డ‌ర్ ను పెట్టాలని, వికెట్ కీపర్ కం కెప్టెన్ కేఎల్ రాహుల్‌ దగ్గరకు వచ్చి విరాట్ కోహ్లీ కాస్త సలహాలు ఇచ్చాడు. అయితే ఆ సలహాలు విన్న కేఎల్ రాహుల్, నీ సలహాలు తనకి ఏమీ అవసరం లేదు అన్న రేంజ్ లో రియాక్షన్స్ ఇచ్చాడు. స్లిప్ లో ఫిల్టర్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఉన్నాడు కదా ఇంకెందుకు? అంటూ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు ప‌క్క‌కు వెళ్లి ఆడుకో అన్న రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు. దీంతో ఒక కంగు తిన్న విరాట్ కోహ్లీ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా పరిశీలిస్తున్న రోహిత్ శర్మ, పగలబడి నవ్వుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. విరాట్ కోహ్లీని అవమానించిన రాహుల్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. కెప్టెన్సీ వ‌చ్చింద‌ని విర్ర‌వీగుతున్నాడ‌ని కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి ఫైర్ అవుతున్నారు కోహ్లీ ఫ్యాన్స్‌.

వ‌న్డే సిరీస్ టీమిండియా వ‌శం

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య నిన్నటితో వన్డే సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో టీమిండియా కైవసం చేసుకుంది. మొదటి వన్డే అలాగే చివరి వన్డేలో విజయం సాధించిన టీమిండియా, 2-1 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మొదట రెండు టెస్టుల సిరీస్ జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీమ్ ఇండియా పరువు మొత్తం పోయింది. అయితే దానికి ప్ర‌తికారంగా ఇప్పుడు వ‌న్డే సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా జట్టు. దీంతో లెక్క సరిపోయింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ రెండు జ‌ట్ల మధ్య ఐదు టీ20 ల సిరీస్ జరగనుంది.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×