Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరుకుంది. అయితే ప్రారంభంలో ముంబై ఇండియన్స్ తడబడింది. ఆ తరువాత పుంజుకొని ప్లే ఆప్స్ కి చేరుకుంది. ముఖ్యంగా మొన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగింది. ఆ కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ప్లే ఆప్స్ కి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై జట్టు విజయం సాధించడంతో మ్యాచ్ ఫిక్సింగ్ అని ట్రోలింగ్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా ముంబై జట్టు పై ఆర్సీబీ గెలిచినప్పుడు కూడా అలాంటి ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కామెంటర్ కౌశిక్ చెప్పాడు.
Also Read : Gill – Rishabh Pant : రిషబ్ పంత్ ను అవమానించిన గిల్.. ఇంత బలుపు ఎందుకు అంటూ ట్రోలింగ్
ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మాత్రమే కాదు.. చాలా మ్యాచ్ ల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ముంబై జట్టు ఈ సీజన్ లో ఆల్ రౌండ్ షో ప్రదర్శిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్.. జట్టులో కూడా అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రారంభంలో 5 మ్యాచ్ ల్లో అంతగా ఆడని ఈ జట్టు.. ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతోంది. ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆప్స్ కి అర్హత సాధించాయి. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో 10 జట్లు ఆడితే.. నాలుగు ప్లే ఆఫ్స్ కి చేరుకున్నాయి. మొదటి స్థానంలో గుజరాత్ టైటాల్స్ ఉ:డగా.. ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మూడో స్థానం, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాయి.
Also Read : Sara – Shubman Gill: ప్రియుడి కోసం జెర్సీ మార్చిన సారా.. గిల్ తో మళ్ళీ కలిసిపోయిందా !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ 10 జట్లు ఆడితే.. నాలుగు జట్లు ప్లే ఆఫ్ కి చేరుకున్నాయి. ఇక మరికొన్ని లీగ్ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు జట్ల స్థానాలు అటు ఇటుగా అవుతాయి. మొదటి స్థానంలో ఉన్న జట్టుకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ఎలిమినేషన్ రౌండ్ లో ఛఆన్స్ ఉంటుంది. ప్రతీ జట్టు మొదటి స్థానంలో నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతీ సీజన్ లో ఐపీఎల్ ఫైనల్ తమకు అనుకూలమైన జట్టు గెలవకపోవడంతో ఫైనల్ వరకు మ్యాచ్ ఫిక్స్ జరిగిందని పేర్కొంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కామెంటర్ మాత్రం అసలు ముంబై మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం లేదని చెప్పాడు. వాస్తవానికి ముంబై విజయంస సాధించినప్పుడల్లా ఇలాంటి కామెంట్లు చేయడం విశేషం. ఐపీఎల్ ఇలాంటి రూమర్స్ ఎప్పుడు మానుతారో మరీ..!