E-Paper
Advertisement

Lalit Modi-Goenka:  సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

Lalit Modi-Goenka:  సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు
Advertisement

Lalit Modi-Goenka :  లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా – కెప్టెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant ) వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత రిషబ్ పంత్ ను ఉద్దేశించి, సంజీవ్ గోయెంకా ( LSG Owner Sanjiv Goenka) రెచ్చిపోయి మాట్లాడారు. ఢిల్లీ చేతిలో ఓట‌మిని త‌ట్టుకోలేక‌ స్టేడియం బౌండరీ గేటు దగ్గర రిష‌బ్ పంత్ పరువు తీశారు. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సృష్టికర్త లలిత్ మోడీ స్పందించారు. వెంటనే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాపై బ్యాన్ విధించాలని.. అతని స్టేడియానికి కూడా రాకుండా చేయాలని కోరారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ( BCCI) రిక్వెస్ట్ చేశారు. దీంతో లలిత్ మోడీ ( Lalit Modi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి

Advertisement

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో మొన్న లక్నో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ కెప్టెన్ గా చేసిన కొన్ని తప్పిదాల కారణంగా లక్నో ఓడిపోయింది. అయితే ఈ క్రమంలో మ్యాచ్ ఫినిష్ కాగానే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ను ఉద్దేశించి ఓనర్ సంజీవ్ గోయెంకా రెచ్చిపోయి వ్యవహరించారు. మ్యాచ్ పూర్తికాగానే బౌండరీ గేట్ దగ్గర క్లాస్ పీకారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. మాజీ క్రికెటర్లు కూడా ఫైర్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే లక్నో ఓనర్ సంజీవ్ ను ఉద్దేశించి మాజీ చైర్మన్ లలిత్ మోడీ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. వెంటనే సంజీవ్ గోయెంకా పైన బ్యాన్ విధించాలని.. వాడు పెద్ద జోకర్ అంటూ సీరియస్ అయ్యారు.

మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన కెప్టెన్ రిషబ్ పంత్, కోచింగ్ స్టాఫ్ ను ఉద్దేశించి సీరియస్ గా వ్యవహరించడం చాలా తప్పన్నారు. ఏదైనా ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకోవాలి.. అంతేకానీ బహిరంగంగా ఇలా దూషించకూడదని సీరియస్ అయ్యారు లలిత్ మోడీ. ఇలాంటి సాంప్రదాయం ఏమాత్రం మంచిది కాదన్నారు. సంజీవ్ గోయెంకా ఓ లూజర్ అని, పెద్ద జోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేయర్లు అలాగే అభిమానుల కోసం టోర్నమెంట్ సృష్టించామని వివరించారు. తానింకా ఐపీఎల్ చైర్మన్ అయి ఉంటే, ఇప్పటికే సంజీవ్ గోయెంకా, లక్నో జట్టుపై శాశ్వతంగా బ్యాన్ విధించే వాడినని హెచ్చరించారు. ఇప్పటికైనా దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరారు.

Advertisement

 

 

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×