RCB VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru vs Mumbai Indians) మ్యాచ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగగా… బెంగళూరు విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఫీల్డర్స్ చేసిన తప్పిదాల కారణంగానే మ్యాచ్ దొబ్బింది. ఈ దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయిపోయింది. పోతు పోతు లక్నోను కూడా ముంబై ఇండియన్స్ తీసుకువెళ్లింది. అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ల్యాప్ టాప్ కలకలం రేపింది. బెంగళూరు సిబ్బంది ఫ్రెడ్డీ వైల్డ్ (Freddie Wilde) అనే వ్యక్తి ల్యాప్ టాప్ (Laptop Controversy) వినియోగించాడు. మ్యాచ్ జరుగుతుండగా అనుమానంగా ల్యాప్ టాప్ తో కనిపించాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ముంబై ఓడిపోయి బెంగళూరు గెలిచిందని అంటున్నారు.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
రాయ్ పూర్ వేదికగా (Shaheed Veer Narayan Singh International Stadium) ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో చివరి వరకు పోరాడిన ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. అటు చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. అవలీలగా సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా అనేక రకాల సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫ్రెడ్డీ వైల్డ్ ల్యాప్టాప్ వినియోగిస్తూ దొరికిపోయాడు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఇప్పటికే మొబైల్ ఫోన్ వాడుతూ చాలా జట్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా.. లేటెస్ట్ గా బెంగళూరు కూడా దొరికింది. బెంగళూరు సిబ్బంది ల్యాప్టాప్ మ్యాచ్ జరుగుతుండగానే ల్యాప్ టాప్తో అనుమానంగా కనిపించాడు. దీంతో బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
రాయపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు ఆడి 166 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేజింగ్ చేసే క్రమంలో రాయల్ చాలెంజెస్ బెంగళూరు చాలానే తడబడింది. కానీ చివరికి రెండు వికెట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించడం గమనార్హం. ఈ గెలుపుతో పాయింట్ల పండితులో నెంబర్వన్ స్థానానికి బెంగళూరు వెళ్లగా.. ముంబై ఇంటిదారి పట్టింది.
Freddie Wilde was using a laptop in the dugout while others can’t even use phones during live matches 💀
If laptops are allowed, what difference do they think there is between a laptop and a phone?— AurelionCricket (@CricketAurelion) May 11, 2026