E-Paper
Advertisement

రాహుల్ గాంధీని ప‌ప్పు అనే ద‌మ్ముందా ? టీమిండియా ప్లేయ‌ర్ల‌పై క‌మ్రాన్ అక్మ‌ల్ హాట్ కామెంట్స్‌

రాహుల్ గాంధీని ప‌ప్పు అనే ద‌మ్ముందా ? టీమిండియా ప్లేయ‌ర్ల‌పై క‌మ్రాన్ అక్మ‌ల్ హాట్ కామెంట్స్‌
Advertisement

Kamran Akmal:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అదే సమయంలో IPL 2026 కూడా అంత కంటే ఎక్కువ జోష్ లో దూసుకు వెళ్తోంది. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ ఆటగాడు నసీమ్ షా పైన ( NASEEM SHAH ) వేటు పడిన సంగతి తెలిసిందే. మరియం నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టిన నేపథ్యంలో నసీమ్ షాపై ఫైన్ విధించారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( KAMRAN AKMAL) షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ప్లేయర్ల లాగా ఇండియన్ క్రికెటర్లు ఎవరూ కూడా రాజకీయ నాయకులపై కామెంట్లు చేయబోరని చురకలు అంటించారు. కానీ అన‌వ‌స‌రంగా న‌సీమ్ షా ట్వీట్ చేశాడ‌ని ఆగ్ర‌హించారు. దీంతో క‌మ్రాన్ అక్మ‌ల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం తెలుపుతున్నాయి.

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

టీమిండియా ప్లేయ‌ర్ల‌పై క‌మ్రాన్ అక్మ‌ల్ హాట్ కామెంట్స్‌

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఓపెనింగ్ సెర్మనీకి వచ్చిన మరియం నవాజ్ షరీఫ్ ను ( NASEEM SHAH ) ఉద్దేశించి నసీమ్ షా వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అయితే ఈ అంశం పైన తాజాగా కమ్రాన్ అక్బర్ స్పందించారు. మరియం నవాజ్ షరీఫ్ లాంటి పాకిస్తాన్ బడా పొలిటీషియన్ పైన కమ్రాన్ అక్మల్ (  Akmal) వివాదాస్పద పోస్టులు పెట్టడం దారుణం అన్నారు. ఆమెను కామెంట్ చేయడానికి కొంచమైనా బుద్ధి ఉందా ? ? తెలివి తక్కువ తనంతో నసీమ్ షా పోస్ట్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీమిండియా క్రికెటర్లను ఉద్దేశించి కూడా కమ్రాన్ అక్మల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా క్రికెటర్లు ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు..

అలాంటి ప్లేయర్లు కూడా ఇండియన్ పాలిటిక్స్ లో ఎలాంటి జోక్యం చేసుకోరు అని తెలిపారు. రాహుల్ గాంధీ లాంటి బడా లీడర్లు పప్పు అని తిట్టగలరా..? మోడీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నేతల జోలికి టీమిండియా క్రికెటర్లు అస్సలు వెళ్ళరని వివరించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీమిండియా క్రికెటర్లు న్యూట్రల్ గా ఉంటూ క్రికెట్ పైన దృష్టి పెడతారని కమ్రాన్ అక్మల్ తెలిపారు. టీమిండియా క్రికెటర్లను చూసి నసీమ్ షా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్రికెటర్లకు రాజకీయాల గురించి అస్సలు అవసరం లేదన్నారు. అనవసరంగా వేలు పెడితే, నసీమ్ షాకు పడిన శిక్ష ప్రతి ఒక్కరికి పడుతుందని హెచ్చరించారు. ఇది ఇలా ఉండ‌గా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో న‌సీమ్ షాపై 2 పీకేఆర్ కోట్ల ఫైన్ విధించింది. ఇమ్రాన్ ఖాన్ ను న‌సీమ్ షా నిత్యం మెచ్చుకునేవాడు. ఈ క్ర‌మంలోనే న‌సీమ్ షాను టార్గెట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Advertisement

 

 

 

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×