E-Paper
Advertisement

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఏపీ మీదుగా వీక్లీ స్పెషల్ రైళ్లు!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఏపీ మీదుగా వీక్లీ స్పెషల్ రైళ్లు!

Indian Railway- Weekly Express Trains: భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి  ఏపీ మీదుగా ఒడిశాకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ కల్పించాలని భావిస్తోంది. ఇందుకోసం రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ కొత్త సర్వీసులు తూర్పు  భారతాన్ని దక్షిణ భారతంతో కలపనున్నాయి. సుదూర ప్రయాణాలను మరింత సులభంగా మార్చనున్నాయి.

త్వరలో అందుబాటులోకి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లు

మొదటి రైలు సంత్రాగాచి – యలహంక – సంత్రాగాచి ఏసీ ఎక్స్‌ ప్రెస్. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12:50 గంటలకు సంత్రాగాచి నుండిచి బయలుదేరి, శనివారం తెల్లవారుజామున యలహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఏప్రిల్ 4 నుంచి ప్రతి శనివారం యలహంక నుండి ప్రారంభమవుతుంది. ఈ రైలు ప్రధానంగా కర్ణాటకకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది.

ఇక మరో రైలు షాలిమార్ – ఎంజీఆర్ చెన్నై – షాలిమార్ వీక్లీ ఎక్స్‌ ప్రెస్. ఇది ఏప్రిల్ 6 నుంచి నడుస్తుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు షాలిమార్ నుండి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఏప్రిల్ 7 నుంచి ప్రతి మంగళవారం చెన్నై నుండి ప్రారంభమవుతుంది. చెన్నై వెళ్లే ప్రయాణికులకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

రెండు రైళ్లు ఏపీ మీదుగా ప్రయాణం

ఈ రెండు రైళ్ల ప్రారంభంతో బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ఈ అదనపు రైళ్లు చాలా ఉపయోగపడతాయి. ఈ కొత్త రైళ్లు ముఖ్యంగా ఒడిశాలోని ప్రధాన నగరాలు,  పట్టణాలకు ఉపయోగపడనున్నాయి. భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్ వంటి కీలక స్టేషన్లలో ఇవి ఆగుతాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చెన్నై, కర్ణాటక, ఏపీ లాంటి ప్రాంతాలకు ప్రయాణించడం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

Read Also: వేసవిలో భూటాన్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంత?

అలాగే, ఈ రెండు రైళ్ల మార్గాలు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ముఖ్యమైన నగరాలను కలుపుతూ వెళ్తాయి.  ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. కొత్త రైళ్లు ప్రారంభమవడంతో ట్రైన్ టికెట్లు పొందడం కూడా కొంతవరకు ఈజీ అవుతుంది. భారతీయ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో మేలు చేయనుంది. ముఖ్యంగా ఒడిశా నుంచి సౌత్ ఇండియాకు వెళ్లే వారికి మంచి అవకాశం కానుంది.

Read Also: అద్భుతం.. విమానం నుంచి చూస్తే తిరుమల ఎంత అద్భుతంగా ఉందో చూడండి!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×