PM MODI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ( Modi Govt) కీలక ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ దేశంతో ఇండియాకు ముప్పు ఉందని… ఈ క్రమంలో ఆ దేశ క్రికెటర్లు ఇండియా కు రావాల్సిన పనిలేదని.. కేవలం ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మ్యాచ్ ఉంటుందని మోడీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పాకిస్తాన్ దుర్మార్గులను ఇండియాకు అస్సలు తీసుకురాకూడదని మోడీ సర్కార్ ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ ప్లేయర్ల నీడ కూడా ఇండియాపై పడొద్దు అంటూ మోడీ సర్కార్ స్ఫష్టం చేసిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి నుంచి గొడవలే ఉన్నాయి. చాలాసార్లు ఇండియా పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగ చాటున వచ్చి బాంబు దాడులు చేశారు. ముంబై పేలుళ్ల నుంచి ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగాయి. మొన్నటికి మొన్న పహల్గాం సంఘటన కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన నుంచి పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు ఇండియన్ క్రికెటర్లు. 2008లో ముంబైలో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్లో ఆడకుండా పాకిస్తాన్ క్రికెటర్ల పైన బ్యాన్ కూడా విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అలాగే ద్వైపాక్షిక సిరీస్ లను రద్దు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, కేవలం ఐసీసీ టోర్నమెంటులో మాత్రమే రెండు జట్లు ఆడేలా చర్యలు తీసుకుంటోంది. పహాల్గం సంఘటనతో మరింత దూరం పెరిగిపోయింది.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లపై తాజాగా మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాళ్లు మొక్కినా కూడా పాకిస్తాన్ ఆటగాలను ఇండియాకు తీసుకు రాకూడదని మోడీ సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగబోవు అని కుండబద్దలు కొట్టి చెప్పింది. ఐసీసీ టోర్నమెంటులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించుకోవచ్చు అని కూడా మోడీ ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. ఇండియాలో ఐసీసీ టోర్నమెంట్ జరిగితే.. ఏ ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ బార్డర్ ఒక్కకూడదని పేర్కొంది. మొన్న శ్రీలంకలో పాకిస్తాన్ మ్యాచ్లు జరిగినట్లుగానే భవిష్యత్తులో కూడా ఉంటాయని స్పష్టం చేసింది. పాకిస్తాన్ దేశానికి ఏ ఒక్క టోర్నమెంట్ కు కూడా ఇండియా వెళ్లబోదని వెల్లడించింది.
Also Read: Tanveer Ahmed: బాబర్ ఒక్క టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed
🚨 INDIAN GOVERNMENT ON ALLOWING PAKISTANI PLAYERS.🚨
– No bilateral cricket with Pakistan ❌.
– Pakistani players allowed only in multi-nation tournaments held in India 🇮🇳.
– Indian team will NOT travel to Pakistan.
– Policy guided by national interest and international… pic.twitter.com/9tfBqgHQOY— Cricket Central (@CricketCentrl) May 6, 2026