Morne Morkel: టీమిండియా పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారయింది. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా ( Team India) ఇటీవల, దక్షిణ ఆఫ్రికా లాంటి చిన్న క్రికెట్ జట్టుపై కూడా చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోవడమే కాదు టెస్టుల్లో వైట్ వాష్ కూడా అయింది టీమ్ ఇండియా. దీనంతటికీ గౌతమ్ గంభీర్ కారణమని కొంతమంది ట్రోలింగ్ చేసుకున్నారు. కానీ అసలు కుట్ర దారుడు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: IPL 2026: వీడు అంత మొనగాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 ఇవ్వాలట, 4 మ్యాచ్ లే ఆడతాడట !
మొన్న దక్షిణాఫ్రికా చేతిలో ( south africa) టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండు టెస్టులకు రెండు కూడా ఓడిపోయింది టీమిండియా. అది స్వదేశంలో కావడం ఇంకా దారుణమైన సంఘటన. ఇండియాలో ఓడించిన మొనగాడే లేడు. కానీ దక్షిణాఫ్రికా చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే దీనికి ప్రత్యేక కారణం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలే కాకుండా ముఖ్య కారణం మోర్నే మోర్కెల్ ( Morne Morkel) అని తెలుస్తోంది. 2024 సంవత్సరం నుంచి టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్ వ్యవహరిస్తున్నాడు. అప్పటి నుంచి టీం ఇండియాకు దరిద్రమే మొదలైంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లలో కూడా అదే పరిస్థితి.
దక్షిణాఫ్రికా చేతిలో టెస్టుల్లో టీమిండియా ఓడిపోవడానికి కారణం మోర్నే మోర్కెల్ కుట్రలే కారణమని ప్రచారం సాగుతోంది. టీమిండియా బ్యాటర్ల వీక్నెస్ లు మొత్తం దక్షిణాఫ్రికాకు లీక్ చేస్తున్నాడట. అలాగే దక్షిణాఫ్రికా బ్యాటర్ల వీక్నెస్ టీమిండియా బౌలర్లకు చెప్పకుండా మరో కొత్త నాటకానికి తెర దించాడట. దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేసేలా మనోళ్లకు బౌలింగ్ నేర్పిస్తున్నాడట మోర్నే మోర్కెల్. ఎందుకంటే మోర్నే మోర్కెల్ కు వెళ్లి సొంత దేశం దక్షిణాఫ్రికానే. అందుకే సొంత దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడట.
ఇప్పుడు రెండో వన్డేలో కూడా అదే తరహాలో కుట్ర చేసి, టీమిండియాను ఓడించినట్లు ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి మోర్నే మోర్కెల్ ను వెంటనే, వెంటనే తొలగించి జహీర్ ఖాన్ లాంటి వాళ్లను బౌలింగ్ కోచ్ గా నియామకం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య చిట్టచివరి వన్డే మ్యాచ్ రేపు జరగనుంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) వేదికగా ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. అయితే ఇందులో గెలిచిన జట్టు సిరీస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా, టీమిండియా చెరో విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
Also Read: Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్..చివరి క్షణంలో కాపాడిన రూట్
BREAKING:
Morne Morkel appointed as the bowling coach of senior India men's team#BCCI #India #IndianCricketTeam pic.twitter.com/I6CqsmCrBX
— Cricbuzz (@cricbuzz) August 14, 2024