BigTV English
Advertisement

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

 


IPL 2025: ఐపీఎల్‌ వేలంకు రంగం సిద్ధం అయింది. అయితే.. ఐపీఎల్లో ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ రూల్ తో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నిబంధన ఒప్పందనను 2022 మెగా వేలంలో బీసీసీఐ పక్కన పెట్టేసింది. మూడేళ్ల అనంతరం దీనిని అమలు చేయబోతున్నారు. అయితే ఈ నిబంధనను ఈసారి బీసీసీఐ మార్చేసింది. ఈ విషయం ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీలకు నచ్చడం లేదని చర్చ జరుగుతోంది. ఆర్టీఎం నిబంధనపై మరోసారి ఆలోచించాలని, కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సూచనలు చేస్తున్నాయి. ఆర్టీఎం ప్రకారం ఎవరైనా ప్లేయర్ ను వేలంలోకి వదిలీ వేసిన మళ్లీ వేలంలో అదే ఫ్రాంచైజీ దక్కించుకునే అవకాశం ఉంటుంది.

ప్రత్యర్థి ఎంత బిట్ వేస్తుందో అదే ధరకు పాత ఫ్రాంచైజీ తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు బుమ్రాను ముంబై ఇండియన్స్ వదిలివేస్తే కనుక బుమ్రా ఆర్సిబి కోసం 20 కోట్లు బిట్ వేస్తే అప్పుడు పాత నిబంధన ప్రకారం అదే 20 కోట్లకు ముంబై ఇండియన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొత్త నిబంధన ప్రకారం 20 కోట్లకు తీసుకునే అవకాశం ఉండదు. ఆర్సిబి మరోసారి బిట్ వేయవచ్చు. 25 కోట్ల కనుక బిట్ వేస్తే ముంబై ఇండియన్స్ 25 కోట్లకు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బుమ్రా వెళ్లిపోతాడు. అందుకే ఆర్టియం కొత్త రూల్ పై కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిని చూపించడం లేదని ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రాథమిక ఉద్దేశానికి కొత్త నిబంధన విరుద్ధంగా ఉందనే చర్చ జరుగుతోంది.


 

కావాలని ప్లేయర్ల రేటును పెంచడానికి అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేలంలో పోటీని పెంచడానికి ఆర్టియం కొత్త రూల్ ను తెచ్చారనే వాధనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫైనల్ గా బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ వేలానికి సంబంధించిన రిటెన్షన్ నిబంధనలను బీసీసీఐ ఇటీవల అనౌన్స్ చేసింది. ప్రతి జట్టు ఆరుగురు ప్రేయర్లను రిటెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సూచించింది. అందులో ఒకరిని రైట్ టు మ్యాచ్ నిబంధన ద్వారా తీసుకోవాలని చెప్పింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈసారి ప్రతి జట్టు పల్స్ విలువ 120 కోట్లకు పెరిగింది. రిటైన్ చేసుకున్న తొలి ఆటగాడికి 18 కోట్లు, రెండవ ఆటగాడికి 14 కోట్లు, మూడవ ఆటగాడికి 11 కోట్లు చెల్లించాలి.

Also Read: Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

ఇక నాలుగవ ఆటగాడి కోసం మళ్ళీ 18 కోట్లు, ఐదవ ఆటగాడి కోసం 14 కోట్లు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని అట్టి పెట్టుకుంటుందనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ నెలాఖరు వరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు ఫ్రాంచైజీలు లిస్టును పంపించాల్సి ఉంటుంది. మొత్తానికి ఈసారి ఫ్రాంచైజీల రూపురేఖలు మారనున్నాయి. కీలక ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదులుకోకపోవచ్చు. ఈసారి స్టార్ ఆటగాళ్లకు వేలంలో భారీగా ధరలు దక్కే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ ను కనుక రోహిత్ శర్మ వదిలేసినట్లయితే అతనికి రికార్డు లెవెల్లో ధర పలుకుతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Related News

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

Big Stories

×