E-Paper
Advertisement

వింబుల్డ‌న్ లో పాకిస్తాన్ క్రికెట‌ర్లకు నో ఎంట్రీ…అయినా దొంగ‌చాటున వ‌చ్చారు క‌ద‌రా

వింబుల్డ‌న్ లో పాకిస్తాన్ క్రికెట‌ర్లకు నో ఎంట్రీ…అయినా దొంగ‌చాటున వ‌చ్చారు క‌ద‌రా
Advertisement

No Pakistani Players In Wimbledon: వింబుల్డన్ టోర్నమెంట్ (Wimbledon) జరిగినప్పుడల్లా… టీమిండియా క్రికెటర్లు మెరుస్తూ ఉంటారు. ఈ టోర్నమెంట్ వెళ్లే టీమిండియా క్రికెటర్లందరూ సూటు, బూట్ ధరించి సెంటర్ ఆఫ్ యాక్షన్ గా నిలుస్తారు. యానిక్ సినర్, జ్వెరెవ్ మధ్య వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. డిపెండింగ్ ఛాంపియన్ సినర్ ఇందులో విజేతగా నిలిచారు. అయితే ఈ వింబుల్డన్ టోర్నమెంట్ లో టీమిండియా క్రికెటర్లు కూడా సందడి చేశారు. యువరాజ్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ హాజరయ్యారు. ఇటీవల కాలంలో క్రికెట్ లోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ వింబుల్డన్ టోర్నమెంట్ కు వచ్చాడు.. కానీ పాకిస్తాన్ ప్లేయర్లు ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో కనిపించలేదు. ఈ ప్రశ్న అందరిని తల పీక్కునేలా చేస్తోంది.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

అసలు వింబుల్డన్ లో పాకిస్తాన్ ప్లేయర్లు ఎందుకు పాల్గొనరు ?

Advertisement

టీమిండియా ప్లేయర్లు నిత్యం వింబుల్డన్ టోర్నమెంట్ లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనాలి అంటే అంతర్జాతీయంగా బ్రాండ్ వ్యాల్యూ కలిగి ఉండాలి. అందుకే సచిన్, విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. వాళ్లకు అంతర్జాతీయంగా బ్రాండ్ వ్యాల్యూ ఉంది. ఈ క్రమంలోనే వాళ్లకు రాయల్ బాక్స్ లో మ్యాచ్ వీక్షించేలా ఆహ్వానాలు అందుతాయి. వాళ్లు వస్తే, వ్యూయర్షిప్ పెరగడమే కాకుండా… పలు కంపెనీలు తమ బ్రాండ్ వ్యాల్యూ పెంచుకునేందుకు ఈ సెలబ్రిటీలను వాడుకుంటాయి. ఏదైనా వ‌స్తువును కూడా మార్కెట్ లోకి తీసుకువెళ్లేందుకు, టీమిండియా క్రికెట‌ర్ల‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వాడుకుంటారు. గ్లోబ‌ల్ గా పాపులారిటీ ఉన్న త‌రుణంలోనే రాయల్ బాక్స్ లో మ్యాచ్ వీక్షించేలా మ‌నోళ్ల‌కు ఆహ్వానాలు అందుతాయి. టీమిండియా క్రికెటర్లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది కాబట్టి… వాళ్లను ప్రత్యేకంగా ఆహ్వానించి.. తమ వస్తువులను జనాల్లోకి తీసుకువెళ్లేలా ప్రకటనలు చేస్తాయి కంపెనీలు.

అదే పాకిస్తాన్ క్రికెటర్లకు గ్లోబల్ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ లేదు. వాళ్లను తీసుకువచ్చి.. ఒక్క కండోమ్ ప్యాకెట్ ను కూడా అమ్మలేమని కంపెనీలు ఎప్పుడో డిసైడ్ అయ్యాయి. ఈ త‌రుణంలోనే పాకిస్తాన్ ప్లేయర్లు ఈ వింబుల్డన్ లో పాల్గొనరు. అలాగే టెన్నిస్ మ్యాచ్ ల‌ను పాకిస్తాన్ క్రికెటర్లు పెద్దగా చూడరు. వాళ్లకు క్రికెట్ తప్ప ఏది సెట్ కాదు. భారత క్రికెటర్లు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న తరుణంలో స్పాన్సర్ ల మద్దతు కూడా విపరీతంగా ఉంటుంది. అందుకే టీమిండియా క్రికెటర్లు లండన్ వస్తే… వాళ్లకు ఆహ్వానం ఇచ్చి మరి ఈవెంట్ కు తీసుకువెళ్తారు.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

వైభవ్ సూర్య వంశీకి కూడా ఆహ్వానం

ఇటీవల కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీకి రాయల్ బాక్స్ లో కూర్చునే అవకాశం దక్కింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వైభ‌వ్ కు పాపులారిటీ ద‌క్కిన నేప‌థ్యంలో అత‌నికి కూడా రాయల్ బాక్స్ లో మ్యాచ్ వీక్షించేలా ఆహ్వానం అందింది. అయితే, వైభ‌వ్ వ‌ల్ల ప‌రువు పోతుంద‌ని గ్ర‌హించిన పాక్ సోష‌ల్ మీడియా, త‌మ క్రికెట‌ర్లు కూడా వింబుల్డన్ లో పాల్గొన్న‌ట్లుగా పోస్టులు క్రియేట్ చేసి, ర‌చ్చ చేస్తున్నారు.

 

Related News

త‌న కంటే 5 ఏళ్లు చిన్న‌వాడైన టీమిండియా కుర్రాడితో మృణాల్ ఠాకూర్ రిలేష‌న్ ?

టీమిండియాతో మ్యాచ్ అంటేనే పాక్ ప్లేయ‌ర్లు ప్యాంట్లు త‌డుపుకుంటున్నారు

త‌న శిష్యుల‌కే అవ‌కాశాలు ఇచ్చి, టీమిండియాను నాశ‌నం చేస్తున్నాడు!

ధోని ఒక్క‌సారి నోరు విప్పితే, వాళ్ల జీవితాలే రోడ్డున ప‌డ‌తాయి

సారా టెండూల్క‌ర్ తో బాబ‌ర్ ఆజం రిలేష‌న్‌? వివాద‌స్ప‌ద పోస్ట్ వైర‌ల్

గంభీర్ పోస్టుకు ఎసరు పెట్టిన బ్రెండన్ మెక్‌కల్లమ్..?

బ్రెండన్ మెక్‌కల్లమ్ పై వేటు…ఇంగ్లాండ్ కోచ్ గా టీమిండియా క్రికెట‌ర్ ?

Big Stories

Advertisement
×