Shubman Gill Breaks Pakistan Record : ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ పరువు మరోసారి గంగలో కలిసింది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ( Shubman Gill) చావు దెబ్బ కొట్టాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకుండా ఆ జట్టు పరువు తీశాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఈ ఏడాది గిల్ చేసిన పరుగులు కూడా… పాకిస్తాన్ ఆటగాళ్లు అందరూ కలిసి చేయలేకపోయారు. మూడు టెస్టుల్లో పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన పరుగుల కంటే, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎక్కువే చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (England vs. Team India) మధ్య గత ఏడాది ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా కెప్టెన్ గిల్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఒకే సిరీస్ లో అత్యంత ప్రభావంతమైన ప్రదర్శన చేసిన టాప్ ఆటగాళ్లలో కెప్టెన్ గిల్ నిలిచాడు. అయితే ఈ ఐదు టెస్టుల్లో గిల్ ఒక్కడే చేసిన పరుగులు కూడా పాకిస్తాన్ టెస్ట్ జట్టు చేయలేక పోయింది. ఇటీవల కాలంలోనే ఇంగ్లాండ్ పర్యటనకు పాకిస్తాన్ టెస్ట్ జట్టు వెళ్ళింది.
ఈ టోర్నమెంట్ లో మొత్తం మూడు టెస్టులు ఆడాల్సి ఉండగా… ఇప్పటికే రెండింటిలో ఓడిపోయింది. మూడో టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా ఫినిష్ చేసుకుంది. ఇలా మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు.. ఇప్పటి వరకు కేవలం 743 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐదు ఇన్నింగ్స్ లు ఆడి గిల్ కంటే తక్కువ పరుగులే పాకిస్తాన్ ప్లేయర్ లందరూ కలిసి చేయగలిగారు. దీంతో మళ్లీ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకుండా.. ఆ జట్టును గిల్ దెబ్బ కొట్టాడని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు పర్యటించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడిపోయిన పాకిస్తాన్… మూడో టెస్టులో కూడా ఓడిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. ఇందులో కూడా పాకిస్తాన్ ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే వైట్ వాష్ కావడం గ్యారెంటీ. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు ముందుగా చెప్పినట్లుగానే 3-0 తేడాతో పాకిస్తాన్ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడో టెస్ట్ ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో 133 పరుగులకే పాకిస్తాన్ కుప్పకూలింది.