Pakistani Players visiting The bar Or Clubs: ఇంగ్లాండ్ ( England ) పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan cricket team) ఘోర అవమానాలను చవి చూస్తోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో రెండు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు…. మూడో టెస్టులో కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే… వైట్ వాష్ తప్పదు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ల గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మూడో టెస్ట్ కంటే ముందు 9 మంది పాకిస్తాన్ క్రికెటర్లు నైట్ క్లబ్ కు ( Bar) వెళ్లి పీకల దాకా తాగారట. పీకల దాకా తాగడమే కాకుండా…నైట్ క్లబ్ లోనే రచ్చ రచ్చ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో వాళ్లపై ఎనిమిది వందల డాలర్ల ఫైన్ కూడా పడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్ బస్టన్ వేదికగా మూడో టెస్ట్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు 9 మంది పాకిస్తాన్ ప్లేయర్లు నైట్ క్లబ్ కు వెళ్లినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. రెండు టెస్టుల్లో ఓడిపోయిన బాధలో ఉన్న పాకిస్తాన్ ప్లేయర్లు… రిలాక్స్ కోసం సరదాగా నైట్ క్లబ్ కు వెళ్లారట. అక్కడ సుక్క, ముక్క.. వేసుకొని ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు అక్కడ ఉన్న సిబ్బందితో కూడా కొంత మంది పాకిస్తాన్ ప్లేయర్లు గొడవపడినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో కొంత మంది పాకిస్తాన్ క్రికెటర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఈ క్రమంలో గొడవ పెద్దది కాకుండా ఎనిమిది వందల డాలర్ల డబ్బులను ఆ నైట్ క్లబ్ యాజమాన్యానికి కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నైట్ క్లబ్ పార్టీలో మహమ్మద్ రిజ్వాన్ మాత్రం లేడని సమాచారం. మిగిలిన క్రికెటర్లందరూ ఇందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ బయటకు వచ్చిన నేపథ్యంలో మళ్లీ పాకిస్తాన్ క్రికెటర్లపై ట్రోలింగ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ పైన గెలవడం చేతకాదు కానీ… జల్సాలు మాత్రం చేస్తున్నారని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఫైర్ అవుతున్నారు. అయితే ఈ నైట్ క్లబ్ వ్యవహారం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తాజాగా తెలిసినట్లు తెలుస్తోంది. దీనిపై రహస్యంగా విచారణ కూడా ప్రారంభించింది అంట. 9 మంది క్రికెటర్లు ఎవరనే దానిపైన ఆరా తీస్తున్నారట. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళపై యాక్షన్ కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.