Pak On Kavya Maran: జపాన్ దేశంలో జరిగే ఆసియా క్రీడాల (Asian sports) కోసం టీమిండియాతో పాటు పాకిస్తాన్ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే టీమిండియా తమ జట్టును ప్రకటించగా… లేటెస్ట్ గా పాకిస్తాన్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ కెప్టెన్ గా పాకిస్తాన్ జట్టుకు వ్యవహరిస్తుండగా, 15 మంది సభ్యులను ఇందులో చేర్చారు. వైస్ కెప్టెన్ గా కొత్త కుర్రాడు అబ్దుల్ సమద్ కు అవకాశం వచ్చింది. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్ క్రికెటర్ల పై వేటు పడింది. కొత్త కుర్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
ఆసియా క్రీడల కోసం తాజాగా పాకిస్తాన్ జట్టును PCB ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టును ప్రకటించిన నేపథ్యంలో కావ్య పాపకు ఊహించని షాక్ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా ఫర్హాన్ ను ప్రకటించగా… వైస్ కెప్టెన్ గా అబ్దుల్ సమద్ ను ప్రకటించిన నేపథ్యంలో కావ్య పాపకు (Kavya Maran ) అన్యాయం జరిగిందని అంటున్నారు. ఈ జట్టులో అబ్రార్ అహ్మద్ ను ఫైనల్ చేసినప్పటికీ.. అతనికి కెప్టెన్సీ లేదా వైస్ కెప్టెన్సీ మాత్రం ఇవ్వలేదు మొహ్సిన్ నఖ్వీ (mohsin naqvi). ఫర్హాన్ కంటే చాలా సీనియర్ ఆటగాడు అబ్రార్ అహ్మద్.
పాకిస్తాన్ జట్టులో అత్యంత కీలక ప్లేయర్ గా కావ్య పాప కొనుగోలు చేసిన అబ్రార్ అహ్మద్ ఉన్నాడు. అయితే అలాంటి ఆటగాడికి కెప్టెన్సీ లేదా చివరికి వైస్ కెప్టెన్సీ అయిన ఇస్తే బాగుండని సోషల్ మీడియాలో పాకిస్తాన్ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతన్ని ఇండియాకు సంబంధించిన కావ్య కొనుగోలు చేసిన నేపథ్యంలో… సాధారణ ప్లేయర్ గా అతడిని తీసుకున్నారని అంటున్నారు. ఆమెకు షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో నఖ్వీ కావాలనే కుట్రలు చేశారని అంటున్నారు. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, అబ్రార్ అహ్మద్ కు కెప్టెన్సీ ఇస్తే, కావ్య యాజమానిగా ఉన్న సన్ రైజర్స్ లీడ్స్ జట్టు బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగే ఛాన్స్ ఉండేదని అంటున్నారు. అయితే, అతనికి కెప్టెన్సీ రాకపోవడంతో, కావ్యకు ఎదురుదెబ్బ తగిలినట్లు ప్రచారం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న ది 100 లీగ్ టోర్నమెంట్ వేలం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేశారు. 2.34 కోట్లు పెట్టి మరి, అతని కొనేసింది కావ్య. ఆ తర్వాత కావ్య పాపపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దేశద్రోహి అంటూ కూడా పోస్టులు పెట్టారు. అయినప్పటికీ డేర్ చేసి, ముందుకు సాగింది. దీంతో బిసిసిఐ కూడా తోక ముడుచుకోవాల్సి వచ్చింది.