Pakistan Cricketers Fined: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందే పాకిస్థాన్ ప్లేయర్లకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా ముగ్గురు పాకిస్థాన్ ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వేటు వేసింది. షాహీన్ షా ఆఫ్రిది ( Shaheen Shah Afridi ), సౌద్ షకీల్ అలాగే కమ్రాన్ గులామ్లకు జరిమానా విధించింది ఐసీసీ పాలక మండలి. సౌతాఫ్రికా ప్లేయర్లతో రూడ్ గా ప్రవర్తించినందుకు గానూ… షాహీన్ షా ఆఫ్రిది, సౌద్ షకీల్ ( Saud Shakeel ) అలాగే కమ్రాన్ గులామ్లకు జరిమానా విధించడం జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఐసీసీ. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందే పాకిస్థాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య… ట్రై సిరీస్ నిర్వహించారు. పాకిస్థాన్ దేశంలోనే.. ఈ వన్డే సిరీస్ మూడు జట్ల మధ్య జరుగుతోంది.
Also Read: Rishabh Pant: ఆనాడు రిషబ్ పంత్ను కాపాడాడు.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు !
ఇప్పటికే ఈ టోర్నమెంట్ ఫైనల్ దశకు వచ్చింది. న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య రేపు అంటే శుక్రవారం రోజున ఫైనల్ కూడా జరుగనుంది. ఆ తర్వాత… ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే.. బుధవారం.. రోజున సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ లో భాగంగా… వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా ప్లేయర్లతో రూడ్ గా బీహేవ్ చేశారు పాక్ ప్లేయర్లు. మొదటగా….సఫారీ ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే తో ( Matthew Breetzke ) గొడవ పెట్టుకున్నాడు పాకిస్థాన్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది ( Shaheen Shah Afridi ). ఈ మ్యాచ్ 29 వ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న సఫారీ ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే పైకి ( Matthew Breetzke ) గొడవకు వెళ్లాడు అఫ్రీది. అలా రెండు సార్లు ఒకే ఓవర్ లో జరిగింది.
Also Read: Natasha Pandya – Hardik Pandya: సిక్సులతో పాండ్యా ఉగ్రరూపం… నటాషా రియాక్షన్ అదుర్స్ !
ఇక ఆ తర్వాత… టెంబా బావుమాను ఔట్ చేసిన తర్వాత… రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారు పాకిస్థాన్ ప్లేయర్లు. ఇందులో సౌద్ షకీల్ మరియు కమ్రాన్ గులామ్ ఇద్దరూ ఉన్నారు. సౌద్ షకీల్, సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ఇద్దరూ… కూడా వికెట్ కోల్పోయిన టెంబా బావుమాను ( Temba Bavuma) వెక్కిరించారు. పొట్టిగా ఉన్నాడంటూ గ్రౌండ్ లోనూ ర్యాగింగ్ చేశారు. దీంతో.. సౌద్ షకీల్, సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ల పైన ( Kamran Ghulam ) ఫైన్ పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్లో ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు షాహీన్ షా ఆఫ్రిదిపై ( Shaheen Shah Afridi ) తన మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. అటు సౌద్ షకీల్, సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ల మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించారు. కాగా ఈ మ్యాచ్ లో సఫారీలను చిత్తు చేసి… ఫైనల్ కు వెళ్లింది పాకిస్థాన్. దీంతో రేపు న్యూజిలాండ్ వర్సెస్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
Shaheen Shah Afridi fined 25% of his match fee for "inappropriate physical contact with a Player".
Saud Shakeel and substitute fielder Kamran Ghulam fined 10% of their match fees for celebrating too closely to batter Temba Bavuma following his run-out.#TriSeries #PAKvsSA… pic.twitter.com/iSWa9OUubx
— InsideSport (@InsideSportIND) February 13, 2025