E-Paper
Advertisement

Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !
Advertisement

Shahid Afridi On Petrol :  పాకిస్తాన్ దేశంలో పెట్రోల్ ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ డీజిల్ ధర 520.35 రూపాయలు కాగా పెట్రోల్ ధరలు లీటర్ కు 458.40 రూపాయలకు చేరుకుంది. దీంతో తీవ్ర స్థాయిలో వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సమస్య ఉందని.. ధరలు పెరగడం సాధారణమని పేర్కొన్నారు. అన్ని దేశాల కంటే పాకిస్తాన్ లో మెరుగైన పాలన కొనసాగుతోందని.. ధరలు కూడా తక్కువగానే ఉన్నాయని వెల్లడించారు. పెరిగిన ధరలను అందరూ అంగీకరించాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ అఫ్రిది.

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement

పాకిస్తాన్ దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆదేశం మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది షాకింగ్ వీడియో రిలీజ్ చేశారు. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. యుద్ధం కారణంగా ప్రతి దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉందని వెల్లడించారు. అన్ని దేశాల కంటే పాకిస్తాన్ సర్కార్ ధరలను తక్కువగానే పెంచుతోందని స్పష్టం చేశారు.

అలాగే యుద్ధాన్ని పాకిస్తాన్ చాలా చక్కగా ఎదుర్కొంటుందని కితాబ్ ఇచ్చారు. దేశ పురోగతి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు సర్కార్ తీసుకుంటోంది.. వీటిని పాకిస్తాన్ ప్రజలు భరించాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ అఫ్రిది. పెట్రోల్ లీటర్ 500 కాదు, 2000 రూపాయలు పెరిగినా కూడా భరించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రజలు మండిపడుతున్నారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావ్ ? పేద వాడి గురించి కూడా ఆలోచించాలి అని చురకలు అంటిస్తున్నారు.

పాకిస్తాన్ లో భారీగా పెరిగిన చమురు ధరలు

Advertisement

ఇరాన్ మొండి వైఖరితో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ లో నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు చమురు ధరలు పెరిగాయి. లేటెస్ట్ గా లీటర్ పెట్రోల్ పైన 42.7% పెంచింది సర్కార్. దీంతో పాకిస్తాన్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 458.40 రూపాయలుగా ఉంది. డీజిల్ పైన 54.9% పెరగడంతో దాని ధర 520 రూపాయలకు చేరుకుంది. అయితే పాకిస్తాన్ లో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ మన ఇండియాలో మాత్రం, ధరలు పెరగడం లేదు. సామాన్యులపై భారం పడకుండా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో పెట్రోల్ ధరలు పెరగలేదు.

 

 

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

 

 

 

Related News

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

ఫ్లాట్ పిచ్ లు ఉండ‌వు.. 2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్

Big Stories

Advertisement
×