Shahid Afridi On Petrol : పాకిస్తాన్ దేశంలో పెట్రోల్ ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ డీజిల్ ధర 520.35 రూపాయలు కాగా పెట్రోల్ ధరలు లీటర్ కు 458.40 రూపాయలకు చేరుకుంది. దీంతో తీవ్ర స్థాయిలో వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సమస్య ఉందని.. ధరలు పెరగడం సాధారణమని పేర్కొన్నారు. అన్ని దేశాల కంటే పాకిస్తాన్ లో మెరుగైన పాలన కొనసాగుతోందని.. ధరలు కూడా తక్కువగానే ఉన్నాయని వెల్లడించారు. పెరిగిన ధరలను అందరూ అంగీకరించాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ అఫ్రిది.
పాకిస్తాన్ దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆదేశం మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది షాకింగ్ వీడియో రిలీజ్ చేశారు. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. యుద్ధం కారణంగా ప్రతి దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉందని వెల్లడించారు. అన్ని దేశాల కంటే పాకిస్తాన్ సర్కార్ ధరలను తక్కువగానే పెంచుతోందని స్పష్టం చేశారు.
అలాగే యుద్ధాన్ని పాకిస్తాన్ చాలా చక్కగా ఎదుర్కొంటుందని కితాబ్ ఇచ్చారు. దేశ పురోగతి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు సర్కార్ తీసుకుంటోంది.. వీటిని పాకిస్తాన్ ప్రజలు భరించాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ అఫ్రిది. పెట్రోల్ లీటర్ 500 కాదు, 2000 రూపాయలు పెరిగినా కూడా భరించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రజలు మండిపడుతున్నారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావ్ ? పేద వాడి గురించి కూడా ఆలోచించాలి అని చురకలు అంటిస్తున్నారు.
ఇరాన్ మొండి వైఖరితో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ లో నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు చమురు ధరలు పెరిగాయి. లేటెస్ట్ గా లీటర్ పెట్రోల్ పైన 42.7% పెంచింది సర్కార్. దీంతో పాకిస్తాన్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 458.40 రూపాయలుగా ఉంది. డీజిల్ పైన 54.9% పెరగడంతో దాని ధర 520 రూపాయలకు చేరుకుంది. అయితే పాకిస్తాన్ లో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ మన ఇండియాలో మాత్రం, ధరలు పెరగడం లేదు. సామాన్యులపై భారం పడకుండా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో పెట్రోల్ ధరలు పెరగలేదు.
Also Read: IPL 2026: KKRపై సన్ రైజర్స్ బంపర్ విజయం..పాకిస్తాన్ లో సంబరాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్
🚨 PAKISTAN GETS SHAHID AFRIDI TO MANAGE PUBLIC FALLOUT AFTER FUEL PRICE HIKE
"Pakistan is still better off than many nations amid the global energy crisis. Now is the time to stand with the government and follow its direction for national progress."
Prices hiked by 138%🤡 pic.twitter.com/QpnnCkMkYj
— Brutal Truth (@sarkarstix) April 2, 2026