E-Paper
Advertisement

Pakistan PM-ICC: పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్ చెత్త వాగుడు..PCBకి ఇక చిప్ప‌కూడే..ఐసీసీ స్కెచ్ అదుర్స్‌

Pakistan PM-ICC: పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్ చెత్త వాగుడు..PCBకి ఇక చిప్ప‌కూడే..ఐసీసీ స్కెచ్ అదుర్స్‌
Advertisement

Pakistan PM-ICC: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan) మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఐసీసీ ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఇండియాతో అసలు మ్యాచ్ ఆడబోమంటూ మొండిపట్టు పట్టింది పాకిస్తాన్. ఐసీసీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, అసలు పట్టించుకోవడమే లేదు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Shehbaz Sharif ) మరో సంచలన ప్రకటన చేశారు. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, టీమిండియా తో మ్యాచ్ ఆడేది లేదు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించేశారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. అయితే ఈ ప్రకటన నేపథ్యంలో ఐసీసీ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ వల్ల నష్టాన్ని మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో కక్కించేందుకు సిద్ధమైందట. ఈ మేరకు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది ఐసీసీ.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

కోర్టు మెట్లు ఎక్కనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే, షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత పాకిస్తాన్ మాట మార్చింది. కుక్క తోక ఎప్పుడూ వంకర అన్న చందంగా పాకిస్తాన్ వ్యవహారం మారింది. ఈ నేపథ్యంలో ఐసీసీ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైందట. ఐసీసీ యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఇప్పటికైనా ఇండియాతో మ్యాచ్ ఆడండి.. లేదా 35 మిలియన్ డాలర్స్ ఐసీసీకి కట్టాల్సిందేనని వార్నింగ్ ఇచ్చిందట. అంటే దాదాపు 300 కోట్ల వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన జేబు నుంచి డబ్బులు కట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ కట్టబోమంటూ డ్రామాలు చేస్తే, కోర్టు మెట్లు ఎక్కనుందట ఐసీసీ. ఐసీసీ రూల్స్ ప్రకారం ఎలాంటి కారణం చూపకుండా మ్యాచ్ బహిష్కరిస్తే, సదరు క్రికెట్ బోర్డు మాత్రమే ఆ నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనట. అందుకే బ్రాడ్ కాస్టర్లతో పాటు ఐసీసీకి డబ్బులు సిద్ధం చేసుకోవాలట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే భవిష్యత్తులో విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వనుందట ఐసీసీ (ICC). ఇక ఇండియా మ్యాచ్ స్కిప్ చేస్తే… టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ను తొలగించే ప్రమాదం కూడా ఉందట. అంటే ఇండియాతో మ్యాచ్ ఆడ‌కుంటే, పాకిస్తాన్ కే అన్ని విధాల న‌ష్టాలు జ‌రిగే ప్ర‌మాదం ఉంది అన్న మాట‌.

Advertisement

Also Read: Pakistan PM-ICCMS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని! 

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×