Sahibzada Farhan: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) ఇప్పటికే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా విజయం సాధించింది. పాకిస్తాన్ పై ఏకంగా 61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. అయితే టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND vs PAK ) మధ్య మరోసారి మ్యాచ్ జరగనుందని చెబుతున్నారు. అది కూడా ఫైనల్స్ లో ఈ రెండు జట్లు తలపడతాయని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే టీమ్ ఇండియా జట్టుకు పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) వార్నింగ్ ఇచ్చాడు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాకు సినిమా చూపిస్తామని హెచ్చరించాడు సాహిబ్జాదా ఫర్హాన్. 2021 సమయంలో ట్రైలర్ చూపించామని, ఇక ఇప్పుడు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చాడు సాహిబ్జాదా ఫర్హాన్. దీంతో సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( t20 world cup 2026) నేపథ్యంలో ఇప్పటికే పాకిస్థాన్ అలాగే టీమిండియా ఆ రెండు జట్లు కూడా సూపర్ 8 చేరుకున్నాయి. ఈ రెండు జట్లు వేరు వేరు గ్రూపుల్లో ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సూపర్ 8 లో అద్భుతంగా రాణించి, ఈ రెండు జట్లు ఫైనల్ ఆడతాయని అంటున్నారు. లేదా సెమీఫైనల్ లో అయినా రెండు జట్లు తలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరిగితే మాత్రం పాకిస్తాన్ గెలుస్తుందని కూడా జోష్యం చెబుతున్నారు.
ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ( Sahibzada Farhan ) కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. గతంలో టీమిండియాకు ట్రైలర్ మాత్రమే చూపించాము… రేపు ఫైనల్స్ లో సినిమా చూపిస్తామని హెచ్చరించాడు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడు ఫర్హాన్. అయితే సాహిబ్జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) చేసిన కామెంట్లకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఒక్కసారి బుమ్రా బౌలింగ్ లో మూడు సిక్సర్లు కొట్టినంత మాత్రాన… ఇండియాను ఓడించే అంత దమ్ము నీకు లేదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మొన్న గ్రూప్ స్టేజిలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనే వికెట్ కోల్పోయావు.. ఇక బుమ్రాను తట్టుకోగలుగుతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు ఇండియన్ ఫాన్స్.