Pakistan vs Sri Lanka: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ రేసులో పాకిస్తాన్ ( Pakistan ) ఉండాలా? ఇంటికి వెళ్లి పోవాలా? అని డిసైడ్ చేసే మ్యాచ్ ఇవ్వాళ జరగనుంది. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ( Pakistan vs Sri Lanka) మధ్య పల్లె కేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో పాకిస్తాన్ విజయం సాధిస్తే, న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి సెమీ ఫైనల్ కు వెళుతుంది. దాదాపు ఈ మ్యాచ్ 70 పరుగులు తేడాతో శ్రీలంక పై పాకిస్తాన్ గెలవాలని చెబుతున్నారు. లేదా 10.5 ఓవర్లలో చేజింగ్ చేసి శ్రీలంకను చిత్తుచేయాలి. ఈ రెండిటిలో ఏది జరిగినా, పాకిస్తాన్ సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.
Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శర్మకు ఘోర అవమానం…చెప్పులు చూపించిన యువరాజు
తప్పక గెలవాల్సిన మ్యాచ్ ను అడ్డదారిన గెలిచేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే టోర్నమెంట్ నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయింది. కాబట్టి పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లేలా సహాయపడాలని మొహ్సీన్ నఖ్వీ స్కెచ్ వేశారట. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతోనే డీలింగ్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్తే, కచ్చితంగా శ్రీలంకలో సెమీస్ మ్యాచ్ లు జరగాలి. అదృష్టం బాగుంటే సెమీ ఫైనల్ తో పాటు ఫైనల్ దాకా పాకిస్తాన్ వెళ్తే, ఫైనల్ మ్యాచ్ కూడా కొలంబోలో నిర్వహిస్తారు. అప్పుడు మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఉండబోదు. శ్రీలంకలో సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు జరిగితే ఆ దేశానికి ఆర్థికంగా చాలా లాభం జరుగుతుంది. టూరిస్ట్ రంగం పైన ఆధారపడి ఉన్న శ్రీలంకకు ఎటు చూసినా మేలే జరుగుతుంది. విదేశీయులు ఎక్కువ సంఖ్యలో లంకకు వస్తారు. దాని వల్ల టూరిస్ట్ రంగానికి ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతం సంక్షోభంలో లంక ఉంది. కాబట్టి సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు జరిగితే లంకకు లాభమే.
ఇదే విషయాన్ని పూస గుచ్చినట్లు శ్రీలంక ప్రభుత్వానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ నఖ్వీ చెప్పారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకే ఇవాల్టి మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచేలా సహాయపడాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి శ్రీలంక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ జట్టు ఎలాగో ఎలిమినేట్ అయింది.. పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్తే ఆర్థికంగా దేశం బలపడుతుందని భావించి శ్రీలంక తలవంచింది. ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్ కు వెళ్లకపోతే, త్వరలో జరగబోయే సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లు అన్నీ కూడా ఇండియాలోనే జరుగుతాయి. దానివల్ల శ్రీలంకకు నష్టమే జరుగుతుంది. ఈ విషయాలను గ్రహించి పాకిస్తాన్ కు సహకరించేందుకు లంక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి ఇవాల్టి మ్యాచ్ లో శ్రీలంక ఎలా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుందో చూడాలి. అయితే ఇదంతా ఫేక్ అని, శ్రీలంక కచ్చితంగా గెలుస్తుందని అక్కడి అభిమానులు అంటున్నారు.
Is Sri Lanka Actually Pakistan's Secret Weapon? 🇱🇰🇵🇰
The math is simple for Pakistan: win big or go home. But for Sri Lanka, the math is complicated.
If SL wins: They head to the finals, but the big-money games shift to India. 📉
If SL loses (just enough): Pakistan qualifies,… pic.twitter.com/GIe5Zrnm6p
— Cricket Central (@CricketCentrl) February 27, 2026