BigTV English

PCB – ICC: పాకిస్థాన్ కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీలో పేరు తొలగింపు ?

PCB – ICC: పాకిస్థాన్ కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీలో పేరు తొలగింపు ?

PCB – ICC: 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఫిబ్రవరి 19 నుండి తెరలేచింది. చివరిసారిగా 2017 లో జరిగిన ఈ టోర్నీలో టీమిండియాను ఓడించి.. పాకిస్తాన్ టైటిల్ సాధించింది. అదే పాకిస్తాన్ ఇప్పుడు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతాపరమైన కారణాలతో భారత్.. పాకిస్తాన్ కి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్ కి సంబంధించిన మ్యాచులు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఓ ఐసిసి టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.


 

ఇలా చాలా కాలం తర్వాత ఓ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడంతో గంతులు వేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.. భారత్ తో కయ్యానికి దిగి లేకపోని సమస్యలు తెచ్చుకుంది. భారత్ పై ఎప్పుడు దురుద్దేశంతో వ్యవహరించే పాకిస్తాన్.. ఈ మెగా టోర్ని ప్రారంభ సమయంలో మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్ లోని కరాచీ జాతీయ స్టేడియంలో భారత జాతీయ జెండాకు చోటు ఇవ్వలేదు. దీంతో అందరూ పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వెంటనే పాకిస్తాన్.. భారత జాతీయ జెండాను ఏర్పాటు చేసింది.


ఇక అప్పటినుండి పాకిస్తాన్ ని నిద్రపోనివ్వడం లేదు భారత్. తాజాగా మరో కాంట్రవర్సీకి తెరలేచింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. సెమిస్ చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. పాకిస్తాన్ కి ఇది చావో రేవో మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఓడిపోతే పాకిస్తాన్ ఇంటిదారి పట్టాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాను ఎలాగైనా ఓడించి తీరాలని పాకిస్తాన్ భావిస్తోంది.

తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం, భారత్ తో జరిగే మ్యాచ్ కి పాకిస్తాన్ జట్టు ఓపెనర్ ఫకర్ జమాన్ లాంటి క్వాలిటీ బ్యాటర్ గాయంతో దూరం కావడం, ఉన్న ఆటగాళ్లు సరిగ్గా రాణించలేకపోవడంతో పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ తరుణంలో భారత్ నుంచి ఆ జట్టుకు గట్టి షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓటమిలో ఉన్న ఆ జట్టుపై పుండు మీద కారం చల్లినట్లు ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొడుతుంది భారత్.

ఇందుకు ఉదాహరణ భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ అని చెబుతున్నారు. ఈ మ్యాచ్ బ్రాడ్ కాస్టింగ్ లో పాకిస్తాన్ పేరు లేకపోవడంతో పిసిబి తట్టుకోలేక పోయింది. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఆతిథ్యదేశంగా ఉన్నందున.. భారత మ్యాచులు దుబాయిలో జరిగినా సరే పాకిస్తాన్ పేరును లైవ్ బ్రాడ్ కాస్టింగ్ లో వాడాలి.

 

కానీ భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో లైవ్ ఫీడ్ లో ఎడమవైపున ఛాంపియన్స్ ట్రోఫీ అనే లోగో మాత్రమే కనిపించింది. ఇందులో పాకిస్తాన్ పేరు లేకపోవడంతో.. లోలోపల కుమిలిపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్ట్ అయిన ఐసీసీ.. ఈ తప్పు మరోసారి రిపీట్ కాదని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి పాకిస్తాన్ ని భారత్ నిద్రపోనివ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×