E-Paper
Advertisement

IND VS PAK Women: అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్తాన్ మ్యాచ్..స్ప్రే కొట్టిన కెప్టెన్ స‌నా

IND VS PAK Women: అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్తాన్ మ్యాచ్..స్ప్రే కొట్టిన కెప్టెన్ స‌నా
Advertisement

IND VS PAK Women: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే ఐదు వికెట్లు నష్టపోయిన టీమిండియా పోరాడుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆగిపోయింది. కొన్ని లైట్ పురుగులు ఆటకు అంతరాయాన్ని కలిగించిన నేపథ్యంలో మ్యాచ్ కాసేపు ఆపేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Dhruv Jurel: 5 ఏళ్లకే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, గోల్డ్ చైన్ తాక‌ట్టు పెట్టిన త‌ల్లి..జురెల్ జీవితాన్ని మార్చేసిన బ‌స్సు ప్ర‌మాదం !

ఇండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కు అంత‌రాయం

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వందకు పైగా టీమిండియా స్కోర్ చేసిన తర్వాత కొన్ని పురుగులు గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి లైట్ పురుగులు అని చెబుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా టీమిండియా బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాయి ఆ పురుగులు. అటు ఫీల్డర్స్ కూడా వాటి వల్ల విసిగిపోయారు. దీంతో కొన్ని స్ప్రేలు తీసుకువచ్చి గ్రౌండ్ లో స్ప్రే చేశారు. పాకిస్తాన్ కెప్టెన్ సనా కూడా ఆ పురుగులపై స్ప్రే చేస్తూ కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయినప్పటికీ పురుగుల తాకిడి… ఏ మాత్రం తగ్గలేదు. మరింత పెరగడంతో మ్యాచ్ అర్ధాంతరంగా ఆపేశారు అంపైర్లు. అనంతరం స్టేడియం నుంచి ఆ పురుగులను వెళ్లగొట్టేందుకు స్ప్రే కొట్టే వాళ్లను రంగంలోకి దింపారు. దీంతో ముఖానికి మాస్క్ వేసుకొని, ఫ్యూమిగేషన్ చేసింది గ్రౌండ్‌ సిబ్బంది. అనంతరం మ్యాచ్ పునః ప్రారంభించారు.

పీకలోతు కష్టాల్లో పడ్డ టీమిండియా

Advertisement

పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది మహిళల టీమిండియా. ఈ మ్యాచ్ లో ఇప్పటికే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా పోరాడుతోంది. 39 ఓవర్లు ఆడిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసింది. హర్లీన్ డియోల్ ఒక్కరే 46 పరుగులు చేయగా జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరూ మినహా మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయింది టీమిండియా.

ప్రస్తుతం దీప్తి శర్మ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా స్నేహ రాణా నాలుగు పరుగులతో గ్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఒక మ్యాచ్ గెలిచి ఊపులో ఉండగా…. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓటేమి చవిచూసింది. ఇప్పటివరకు వన్డేలో టీం ఇండియా పై ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేదన్న సంగతి తెలిసిందే.

Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోద‌రి పెళ్లి చూసిన అభిషేక్ శ‌ర్మ

 

Related News

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

Big Stories

Advertisement
×