IPL players : సాధారణంగా ఐపీఎల్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా ప్రారంభంలో కొన్ని జట్లు ఫామ్ లో కనిపించవు. మరికొన్ని జట్లు ఫామ్ లో కనిపిస్తుంటాయి. ప్రారంభంలో ఫామ్ లో ఉన్న జట్లు ఇంటిదారి పడితే.. ప్రారంభంలో పేలవ ప్రదర్శన జట్లు కొన్ని ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. ఇలా చాలా సందర్భాల్లో ముంబై, చెన్నై జట్లు ప్లే ఆప్స్ కి చేరుకొని టైటిల్ ని సాధించాయి కూడా. మరికొన్ని సందర్భాల్లో కీలక ఆటగాళ్ళు అంతా ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారుతుంటారు. వాస్తవానికి ఒక ప్లేయర్ లేదా ఇద్దరూ ప్లేయర్లు ఒకే జట్టుకు రావడం మనం చూస్తుంటాం. కానీ కొందరూ ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లు ఒక జట్టు నుంచి మరో జట్టులోకి రావడం విశేషం.
Also Read : Marsh Brothers : ఆస్ట్రేలియా బ్రదర్స్ అదుర్స్… అప్పుడు ఆయన… ఇప్పుడు ఈయన… వాయించడమే
ఐపీఎల్ 2018లో పంజాబ్ కింగ్స్ జట్టులో కే.ఎల్. రాహుల్, అక్సర్ పటేల్, విప్రజ్, మోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ ఆటగాళ్లు అంతా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి రావడం విశేషం. అయితే ప్రారంభంలో ఢిల్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కానీ చివరికీ వచ్చే సరికి ఢిల్లీ నిన్న ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి.. ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించింది. కచ్చితంగా విజయం సాధించాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ చేతులెత్తేయడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆప్స్ కి చేరుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ కి చెందిన ఆటగాళ్లంతా ఢిల్లీ కి రావడం విశేషం. ప్రస్తుతం ఢిల్లీ ప్లే ఆప్స్ నుంచి తప్పుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ నలుగురి పై ట్రోలింగ్స్..
గతంలో వీరు నలుగురు పంజాబ్ కింగ్స్ కి ఆడారు. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ప్లే ఆప్స్ కి చేరుకోలేదు. ప్రస్తుతం వీరు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నారు. అయితే వీరు పంజాబ్ కింగ్స్ కి పట్టినా దరిద్రాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కి అంటించారా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పంజాబ్ తరపున కే.ఎల్. రాహుల్ తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. అలాగే మోహిత్ శర్మ కూడా అప్పట్లో అద్భుతమైన బౌలింగ్ చేసేవాడు. కానీ ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేడు. రాహుల్ మాత్రం ప్రస్తుతం ఫామ్ లోనే కొనసాగుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఈ నలుగురు క్రికెటర్ల పై ట్రోలింగ్స్ కొనసాగుతోంది. ఈ ఆటగాళ్లు ఏ జట్టులోకి పోయినా ఆ జట్టు పరిస్థితి అంతేనా..? వీళ్లు జట్టులో ఉంటే.. ఆ జట్టుకి దరిద్రం పట్టినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై తో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇక పంజాబ్ కింగ్స్ జట్టుతో నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించినా.. ప్లే ఆప్స్ కి మాత్రం చేరుకోదు. దీంతో ఢిల్లీ పై ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్లు.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 22, 2025