E-Paper
Advertisement

Vaibhav Suryavanshi – Modi : అదృష్టం అంటే 14 ఏళ్ల వైభవ్ దే… ఏకంగా మోడీ తోనే

Vaibhav Suryavanshi – Modi : అదృష్టం అంటే 14 ఏళ్ల వైభవ్ దే… ఏకంగా మోడీ తోనే
Advertisement

Vaibhav Suryavanshi – Modi : రాజస్థాన్ రాయల్స్ జట్టులో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఆడిన విషయం తెలిసిందే. అతను భారతీయ క్రికెటర్ల రికార్డులను బ్రేక్ చేశాడు. తన తొలి సీజన్ లోనే ఔరా అనిపించాడు. అతను ఆడిన 7 మ్యాచ్ ల్లోనే 252 పరుగులు చేసాడు. ఇందులో ఒక రికార్డు సెంచరీ కూడా ఉంది. జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో సెంచరీ కావడం విశేషం. అత్యంత వేగవంతమైన రెండో సెంచరీ బాదిన క్రికెటర్ గా, అతి పిన్న వయస్కుడిగా రికార్డులు నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో మొత్తంగా38 బంతుల్లో 101 పరుగులు చేసాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో ఎంతో పరిణతి ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Also Read : RCB vs PBKS: ఫైనల్స్ కు చేరిన RCB.. బట్టలు విప్పేసిన హాట్ బ్యూటీ ?

Advertisement

తాజాగా వైభవ్ సూర్యవంశీ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు.  ఈ యువ క్రికెటర్ ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు.  మరోవైపు ప్రధాని మోడీ యువ క్రికెటర్ ని కలిసినట్టు ఓ ట్వీట్ కూడా చేశాడు. ” నేను సంచలన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, అతని కుటుంబాన్ని పాట్నా ఎయిర్ ఫోర్టులో కలిశాను. యావత్ భారతావని అతని క్రికెట్ నైపుణ్యాలను ప్రశంసిస్తోంది. అతని భవిష్యత్ గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నా” అని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని చేసిన ట్విట్టర్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో ఈ టీనేజ్ క్రికెటర్ ఐపీఎల్ లో సాధించినటువంటి అద్భుతాల గురించి ప్రశంసించాడు.

ఐపీఎల్ లో.. బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరును చూశానని.. అంత చిన్నవయస్సులో వైభవ్ గొప్ప రికార్డును సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన వెనుక అతని కఠోర శ్రమ దాగి ఉంది అని ప్రధాని మోడీ అభినందించారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తన ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి వివిధ స్థాయిల్లో అనేక మ్యాచ్ లు ఆడాడు. మీరు ఎంత ఎక్కువగా ఆడితే అంత ఎక్కువగా ప్రకాశిస్తారు. వీలైనంత ఎక్కువ మ్యాచ్ ఆడటం, పోటీలలో పాల్గొనడం చాలా ముఖ్యమని.. మా ప్రభుత్వం ఎప్పుడూ యువ క్రీడాకారులకు అండగా ఉంటుందని ప్రధాని మోడీ యువకుల్లో క్రీడాభిరుచుని ప్రోత్సహించేలా ప్రసంగించారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు  14 మ్యాచ్ లు ఆడితే.. అందులో కేవలం 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్ ల్లో గెలుపు దగ్గరికీ చేరుకొని ఓటమి పాలైంది. 10 మ్యాచ్ ల్లో ఓడిపోవడం విశేషం. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 09వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో ఓటమిలు కాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఎల్లుండి పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫయిర్ 2లో తలపడనుంది. 

Advertisement

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×