E-Paper
Advertisement

Tamarind Leaves: మటన్ ధరను క్రాస్ చేసిన చింత చిగురు.. హైదరాబాద్‌లో ఇదేం రేటు గురూ!

Tamarind Leaves: మటన్ ధరను క్రాస్ చేసిన చింత చిగురు.. హైదరాబాద్‌లో ఇదేం రేటు గురూ!

Tamarind Leaves: నిన్నటి వరకు మటన్ రేటు చూసి ఔరా అనేవారు. ఇప్పుడు మాత్రం ఆ ఒక్క రేటు చూసి, కుయ్యో మొర్రో అనేస్తున్నారు. ఇదేం రేటు భయ్యా.. ఇదేంటి ఇంత రేటు ఏమిటి? అంటూ హైదరాబాద్ నగరవాసులు అవాక్కవుతున్నారు. అంతేకాదు దీనిని చూసి, అటువైపు తలకూడా తిప్పడం లేదట నగర ప్రజలు. మార్కెట్ కు వెళ్లినా, ఇది మనది కాదు అంటూ పలాయనం చిత్తగిస్తున్నారట. ఇంతలా నగర ప్రజలను షాక్ కు గురి చేస్తున్న ఆ ఒక్కటి ఏదో కాదు బాస్.. పల్లెలో ఫ్రీగా దొరికే చింత చిగురు. ఈ పేరెత్తితే హైదరాబాద్ నగరంలో.. వద్దే వద్దు బాబు.. కాస్త రేటు తగ్గిన తర్వాత చూద్దాం అనేస్తున్నారట.

అసలు విషయం ఏమిటంటే..
హైదరాబాద్ బజార్లలో ఇప్పుడు వినిపిస్తున్న మాటే చింత చిగురు ఉందా? కానీ దానికి వెంటనే వినిపించేది.. ఉంది కానీ కేజీ 800 రూపాయలు. ఇక ఆ మాట వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో వేసవి చివర్లో వచ్చే ఓ ప్రత్యేకమైన రుచిగా పేరొందిన చింతచిగురు ధర ఇప్పుడు సామాన్యుడి నోటికి అందని స్థాయికి చేరింది.

ఏమిటి ఈ చింత చిగురుకి ఇంత హై డిమాండ్?
తెలుగు వంటకాలలో చింత చిగురుకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీనితో చేసే పప్పు, పచ్చడి, మాంసం వంటలు భోజనానికి ప్రత్యేక రుచి తీసుకువస్తాయి. కాస్త పులుపు, ఒగరు కలిగిన ఈ ఆకులు వేసవిలో లభించే అరుదైన రుచిగా నిలుస్తాయి. అందుకే మార్కెట్లో దీని కోసం ప్రత్యేకంగా వెతికే వారు ఉంటారు. ఆదరణ ఎక్కువగా ఉండటంతో సరఫరా తక్కువైతే ధరలు స్వయంగా పెరిగిపోతున్నాయి.

సరఫరా తగ్గడంతోనే ధరలు పెరుగుతున్నాయా?
అవును. ఈ ఏడాది పగటి వేడి పెరగడం, వేసవిలో తక్కువ వర్షాలు పడడం వంటి కారణాలతో చింత చెట్లు సకాలంలో చిగురు పెట్టలేదు. కొన్ని ప్రాంతాల్లో తోటల మందుగా వర్షాభావం కూడా ప్రభావం చూపింది. మరోవైపు, తెగుళ్ళ సమస్యలు కూడా చెట్ల పెరుగుదలపై ప్రభావం చూపాయి. ఫలితంగా రైతుల వద్ద నిల్వ తక్కువగా ఉండడంతో మార్కెట్‌కి రావాల్సిన చింత చిగురు పరిమితమైంది.

గ్రామాల్లో రూ.200.. నగరాల్లో రూ.800
విజయవాడ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి గ్రామీణ ప్రాంతాల్లో చింతచిగురు ధర కేజీకి సుమారు రూ.200 నుంచి రూ.300 మధ్య ఉంటుంది. కానీ అదే వస్తువు హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లోకి రాగానే ధరలు మూడింతలు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కేజీ ధర రూ.700 నుండి రూ.800 వరకు చేరింది. కొన్నిచోట్ల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా కూడా దీన్ని ఆర్డర్ చేయడం మొదలైంది.

రుచి కోసం ఖర్చుకు వెనకడుగు లేని వంటల ప్రియులు
వంటల పరంగా రుచి కోసం ఎంతైనా ఖర్చు పెట్టే వారు ఉన్నారు. ముఖ్యంగా పాతబస్తీ, మలక్‌పేట్, మాదాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లోని కొన్ని రుచికరమైన ఫుడ్ హోటళ్లలో చింత చిగురు మటన్, చింతచిగురు రసం వంటి ప్రత్యేక వంటలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఈ వంటలకు అవసరమైన చిగురు భారీ ధరకు కొనుగోలు చేస్తున్నా కూడా తినేవారికి అదొక రుచి విందు మాత్రమే!

రైతులకు లాభమా? మధ్యవర్తుల గోలే ఎక్కువా?
ధరలు పెరిగినా, ఆ లాభం పూర్తిగా రైతులకి చేరుతోందా అనే విషయంలో సందేహాలున్నాయి. ఎందుకంటే గ్రామీణాల్లో రైతుల నుంచి కిలోను రూ.150కి కొనుగోలు చేసి, నగరాల్లో దాన్ని రూ.800కి అమ్మే మధ్యవర్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్యవర్తుల వల్ల వినియోగదారులు అధిక ధరకు కొనాల్సి వస్తోంది, కానీ అసలైన ఉత్పత్తిదారులైన రైతులకు తగిన లాభం లభించడం లేదు.

Also Read: Vizag romantic places: విశాఖతో లవ్ లో పడ్డారా? ఇలా చేయండి.. కిక్కే కిక్కు!

ఆరోగ్య ప్రయోజనాలు
చింత చిగురు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమైనదిగా ఆయుర్వేదం చెబుతుంది. దీనిలో యాసిడ్ లెవల్స్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. వేసవి వేడి నుంచి కొంత ఉపశమనం కలిగించడంతో పాటు, జలుబు, దగ్గు లాంటి చిన్న సమస్యలకు ఇది సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది.

మార్కెట్‌లలో పరిస్థితి
మూసాపేట, ఎర్రగడ్డ, మియాపూర్, ధూల్‌పేట లాంటి మార్కెట్లలో చింతచిగురు కొనుగోలుదారులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటిదే ఈ సీజన్‌లో వస్తుంది, ఇప్పుడు కొని స్టోర్‌ చేసుకుంటే మంచిదంటూ కొంతమంది జోకులు వేయడం విశేషం.

ఫ్యామిలీ వంటల నుంచి హోటల్‌ స్పెషల్ డిష్‌ వరకూ
ఇంటింటా వంటల ప్రేమికులు దీన్ని వాడేందుకు ఆసక్తి చూపుతుండగా, రుచికరమైన రెస్టారెంట్‌లు దీన్ని హైలైట్ డిష్‌లుగా సర్వ్ చేస్తున్నారు. చింతచిగురు మటన్ స్పెషల్, చింతచిగురు పప్పు అన్నం, చింతచిగురు కూర లాంటి ప్రత్యేక డిష్‌లు మెనూలో వచ్చేస్తున్నాయి. ఈ వేసవిలో చింత చిగురు కేజీ రూ.800కి చేరినప్పటికీ, దానికి మంచి ఆదరణ ఉంది. తెలుగు ప్రజల గుండెల్లో చింతచిగురు ఒక వంటకాల రాజుగా స్థానం సంపాదించుకుంది. అందుకే అది ఇప్పుడు నగరాల్లో గ్రీన్ గోల్డ్‌గానే మారిపోయింది. కానీ ఇది కేవలం ప్రచారం మాత్రమేనని, నగరంలో కొన్నిచోట్ల కేవలం రూ. 500 కే దొరుకుతుందని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా చింత చిగురుకు ఇదేం క్రేజ్ రా బాబూ.. అంటున్నారు నగరవాసులు.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×