POK cricketer Sufiyan Muqeem: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ( POK) తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత 15 రోజులుగా బాగ్, రావల్కోట్, ముజాఫ్రహాబాద్ లాంటి ప్రధాన నగరాలలో ప్రజలు వీధుల్లోకి వచ్చి… పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలో విలీనం కాబోతుందని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన క్రికెటర్ సుఫియాన్ ముకీమ్ ( PoK cricketer Sufiyan Muqeem ) సంచలన పోస్ట్ పెట్టాడు. POKలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇండియా స్పందించి.. తమకు సహాయం చేయాలంటూ పోస్ట్ పెట్టారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ప్రజలను కాపాడాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో క్రికెటర్ సుఫియాన్ ముకీమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన PoK క్రికెటర్ సుఫియాన్ ముకీమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. POK ప్రాంతంలో ప్రజలపై దారుణానికి పాకిస్తాన్ సర్కార్ పాల్పడుతుందని ఎమోషనల్ అయ్యాడు. పాకిస్తాన్ సైన్యం దారుణంగా వ్యవహరిస్తూ… నిరసన కారులపై దాడులు చేస్తోందని ఫైర్ అయ్యారు. దీనిపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయని.. ఇండియా కూడా దీనిపై రియాక్ట్ అయినట్లు గుర్తు చేశారు. రియాక్ట్ వరకే ఆగకుండా…. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి ఇండియా సహాయం చేయాలని వెల్లడించినట్లు పోస్టు వైరల్ గా మారింది.
తమ ప్రాంతాన్ని ఇండియా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా అతడు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలందరూ… ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ గా నిలుస్తున్నారని వివరించారు. పాకిస్తాన్ ప్రభుత్వం పైన అక్కడి ప్రజలకు నమ్మకం పోయిందని ఎమోషనల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని ఇండియా ఆధీనంలోకి తీసుకోవడం మంచిదని సూచనలు చేశారు. ఇదే సరైన టైమ్ అంటూ పేర్కొన్నారు. నీతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన PoK క్రికెటర్ సుఫియాన్ ముకీమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వనరుల దోపిడీ, ద్రవ్యోల్బణం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత ఆక్రమిత ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు పాకిస్తాన్ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచిన ఇక్కడి ప్రజలే.. ఇండియాను సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో కలపాలని కోరుతున్నారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం