మొత్తానికి ధావన్ ఎందుకు ఆడటం లేదో వివరం తెలిసింది. పంజాబ్ జట్టు క్రికెట్ డవలప్ మెంట్ హెడ్ సంజయ్ బాంగర్ ఒక ప్రకటనలో అసలు విషయం చెప్పాడు. శిఖర్ ధావన్ భుజానికి గాయమైందని, తనకి రెండు వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారని తెలిపాడు. ఈ క్రమంలో బహుశా ఐపీఎల్ లో జరగబోయే రెండు, మూడు మ్యాచ్ లకి తను అందుబాటులో ఉండకపోవచ్చునని అంటున్నారు.
ఇప్పటికే పాయింట్ల పట్టికలో పంజాబ్ 8వ స్థానంలోకి వెళ్లిపోయింది. 6 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఈ సమయంలో ధావన్ భుజానికి గాయం కావడం నిజంగా పంజాబ్ కి కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. పంజాబ్ త్వరలోనే ముంబై ఇండియన్స్, ఆర్సీబీలతో కీలక మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
Also Read: ధోనీని తలపించిన శాంసన్.. రనౌట్ వీడియో వైరల్..
ఎందుకంటే ఆ రెండు జట్లలో సీనియర్లు, జాతీయ జట్టుకి ఆడుతున్న ఆటగాళ్లున్నారు. వారితో తలపడాలంటే ధావన్ ఉండాల్సిందే. ఎందుకంటే వారి బలాలు, బలహీనతలు తనకే తెలుసు. ఆ సీనియర్లతో ఆడేటప్పుడు జట్టును సమయోచితంగా ముందుండి నడిపించే నాయకుడు ధావన్ అయితేనే కరెక్ట్ అని అంటున్నారు. అయితే శ్యామ్ కర్రన్ కూడా తక్కువేమీ కాదు.
లోస్కోరు మ్యాచ్ ని కూడా కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇంకొక్క 10 పరుగులైనా చేసి ఉంటే, పంజాబ్ గెలిచి ఉండేదని అందరూ అంటున్నారు. అంతకుమించి బౌలింగ్ లో అందరూ రాణించడం కొంచెం ఆశావాహ పరిణామం అని అంటున్నారు. ధావన్ లేకుండా జట్టుని కర్రన్ ఎలా నడిపిస్తోడో ఇక చూడాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.