E-Paper
Advertisement

క్రికెట్ జ‌ట్టును కొనేసిన రాహుల్ ద్ర‌విడ్..అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు

క్రికెట్ జ‌ట్టును కొనేసిన రాహుల్ ద్ర‌విడ్..అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు
Advertisement

European T20 Premier League:  టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టీమిండియాలో బ్యాటర్ గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్, ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. బ్యాటర్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్, ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ గా కూడా కొనసాగాడు. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, టీమిండియా హెడ్ కోచ్ గా కూడా పనిచేశారు. అలాంటి రాహుల్ ద్రవిడ్ మరో కొత్త అవతారం ఎత్తారు. ఏకంగా ఓ క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు రాహుల్ ద్రవిడ్. యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ లో (European T20 Premier League) భాగంగా ఐర్లాండ్ కు సంబంధించిన డబ్లిన్ గార్డియన్స్ (Dublin Guardians ) ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ ను ఓనర్ గా అనౌన్స్ చేస్తూ.. అధికారిక ప్రకటన చేశారు.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

క్రికెట్ జ‌ట్టుకు కొనేసిన రాహుల్ ద్ర‌విడ్..అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2026) ప్రారంభమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక టి20 లీగ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ కూడా సందడి చేసేందుకు వచ్చేసింది. మొత్తం మూడు క్రికెట్ బోర్డులు కలిసి ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్ కు సంబంధించిన డబ్లిన్ గార్డియన్స్ జట్టును కొనుగోలు చేశాడు రాహుల్ ద్రవిడ్. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ కూడా భాగస్వామ్యం అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ జట్టును కెప్టెన్ గా ముందుండి ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నడిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చిన అశ్విన్.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ ఎప్పుడు అంటే ?

యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (European T20 Premier League) ఈ సంవత్సరం ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనుంది. స్కాట్లాండ్, ఐర్లాండ్ అలాగే నెదర్లాండ్స్ క్రికెట్ జట్లు సమిష్టిగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాయి. ఇందులో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. డబ్లిన్ గార్డియన్స్ జట్టును రాహుల్ ద్ర‌విడ్ ఏకంగా రూ.116 కోట్ల‌కు కొనుగోలు చేసినట్లు స‌మాచారం. 10 ఏళ్ల పాటు ఈ హ‌క్కులు ద్ర‌విడ్ సొంతం కానున్నాయి. ఇక ప్రతి సీజన్ కు ఆటగాళ్ల శాలరీ కోసం ఒక్కో జట్టు సుమారు 11.5 కోట్లు ఖర్చు చేయనుంది. అటు అభిషేక్ బచ్చన్ ( Abhishek bacchan) కూడా ఓ జట్టుకు సహా ఓనర్ గా కొనసాగుతున్నాడు.

Advertisement

 

 

 

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×