E-Paper
Advertisement

ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది..నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది..నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు
Advertisement

Ramiz Raza: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య ఇవాల్టితో టెస్ట్ సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. రెండు టెస్టుల్లో కూడా దారుణంగా ఓడిపోయింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. తాజాగా రమీజ్ రాజా ( Ramiz Raza) కూడా పాకిస్తాన్ ఆట తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆస్ట్రేలియా కంటే బంగ్లాదేశ్ చాలా భయంకరంగా తయారైందని.. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓడిపోయిందన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లను అర్ధరాత్రి తలుచుకొని పాకిస్తాన్ ప్లేయర్లు పోతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియాతో ఆడుతున్నామన్న భ్ర‌మ‌లోకి వెళ్లి పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిందని చురకలు అంటించారు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సిల్హెట్ వేదికగా ఈనెల 16వ తేదీన రెండవ టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్ట్ ఇవాళ లంచ్ సమయం వరకే క్లోజ్ అయింది. అప్పటికే బంగ్లా దాటికి పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో 78 పరుగుల తేడాతో రెండో టెస్ట్ సొంతం చేసుకుంది బంగ్లాదేశ్. అంతేకాదు సొంత గడ్డపై పాకిస్తాన్ ను వైట్ వాష్ చేసి బంగ్లాదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే బంగ్లా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుపై రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్… ఆస్ట్రేలియా తరహాలో తయారయిందని.. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లు వణికిపోయారని బాంబు పేల్చారు.

నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

ఆస్ట్రేలియా ప్లేయర్లతో ఆడుతున్నామని ఊహించుకొని ఓడిపోయారని ఎద్దేవా చేశారు రమీజ్ రాజా. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ ప్లేయర్లలో సీరియస్ నెస్ ఎక్కడ కనిపించలేదని మండిపడ్డారు. మహమ్మద్ రిజ్వాన్ కు వికెట్ కీపింగ్ చేయడం చేతకావడం లేదని విమర్శలు చేశారు. ఇక కెప్టెన్ షాన్ మసూద్ ను ఎంత తిట్టినా దండగే అన్నారు. అసలు వాడికి కెప్టెన్సీ ఇచ్చిన వాడిని తన్నాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రమీజ్ రాజా. ఇలాగే పాకిస్తాన్ ఆట తీరు కొనసాగితే… క్రికెట్ చూడడమే అభిమానులు మానేస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా బాబర్ ఆజం కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే పాకిస్తాన్ మళ్లీ విజయాల బాట పడుతుందని తెలిపారు. ఇది ఇలా ఉండ‌గా, పాకిస్తాన్ ఇప్ప‌టికే బంగ్లాదేశ్ చేతిలో వ‌న్డేతో పాటు టీ20 సిరీస్ కోల్పోయింది. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా మిస్ చేసుకుంది.

Advertisement

Also Read: Trolls On Rizwan: 50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు 

 

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×