Ravi Shastri: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) కుమారుడు, ఐసీసీ బాస్ జై షా ( Jay Shah) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంచెలు అంచెలుగా… ఎదిగిన ఆయన, ఐసీసీ చైర్మన్ పదవిని కూడా దక్కించుకున్నారు. మొదట బీసీసీఐ పదవులను, అనుభవించిన జై షా… ఇప్పుడు ఐసీసీని ఏలుతున్నారు. అయితే, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జై షాకు పదవులు దక్కాయని, దీని వెనక అమిత్ షా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే, ఈ ఆరోపణలను టీమిడియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కొట్టి పారేశారు. అందరూ అనుకున్నట్లుగా అమిత్ షా వల్ల, జై షాకు పదవులు రాలేదని… దీని వెనుక కఠోర శ్రమ ఉందని రవి శాస్త్రి (Ravi Shastri) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత కాళ్లపై ఐసీసీ బాస్ జై షా నిలబడ్డారని.. ఎంతో కష్టపడితే తప్ప ఆయనకు ఈ పదవులు రాలేదని తెలిపారు. కష్టం ఫలితంగానే ఇప్పుడు పెద్ద పదవులు ఆయనకు దక్కాయని వివరించారు. దీంతో రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐసీసీ (ICC) చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జై షా పైన ( Jay Shah) చాలా మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అమిత్ షా లేకపోతే అతనికి ఈ పదవులు వచ్చేవి కావని ఆడుకుంటూ ఉంటారు. అసలు క్రికెట్ బ్యాట్ పట్టడం కూడా చేతకాని జై షాను ఐసీసీ చైర్మన్ ఎలా చేశారని కూడా చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్లందరికీ కౌంటర్ ఇస్తూ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఎవరిని బెదిరించి, జై షాకు పదవులు ఇప్పించలేదని రవి శాస్త్రి ( Ravi shastri) క్లారిటీ ఇచ్చారు.
ఐసీసీ బాస్ జై షా చాలా కష్టపడి పదవులను దక్కించుకున్నారని వెల్లడించారు. అందుకే ఈ స్థాయి వరకు ఎదిగారని పేర్కొన్నారు. బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. అందుకే రోహిత్ శర్మ కెప్టెన్ అయి, టీమిండియా కు ఎన్నో విజయాలను అందించడానికి వెల్లడించారు. అప్పట్లో జై షా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు టీమిండియా మంచి స్థాయిలో ఉందని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయ్యే వరకు జై షా… ఐసీసీ చైర్మన్ గా కొనసాగనున్నాడు.