BigTV English

CSK – RCB: RCB జెర్సీతో అభిమాని.. చితకబాదిన ధోని ఫ్యాన్స్… వీడియో వైరల్

CSK – RCB: RCB జెర్సీతో అభిమాని.. చితకబాదిన ధోని ఫ్యాన్స్… వీడియో వైరల్
Advertisement

CSK – RCB: తెలుగు సినీ ఇండస్ట్రీలో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల జన్మదినం సందర్భంగా వారి సినిమాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి.. అభిమానుల ఆదరణ పొందాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓ దిగ్గజ క్రికెటర్ వంతు వచ్చింది. అవును.. టీమిండియా మాజీ కెప్టెన్, తలా మహేంద్ర సింగ్ ధోనీ సమయం వచ్చింది.


Also Read: Jadeja – Root: జడేజా కోతి చేష్టలు.. రూట్ సెంచరీ కాకుండా ఎలా అడ్డుకున్నాడో చూడండి.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

ధోని మూవీ రీ రిలీజ్:


జులై 7న మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా ” ఎం.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ” చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోలను హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతిలో మాత్రమే ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్ లో మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇక ధోని సినిమాని థియేటర్ లో వీక్షించేందుకు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ విరాట్ కోహ్లీ అభిమాని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} టీం కి సంబంధించిన విరాట్ కోహ్లీ 18 జెర్సీని ధరించి ధోని మూవీని వీక్షించేందుకు వచ్చాడు.

కోహ్లీ అభిమానిని చితకబాదిన ధోని అభిమానులు:

ఈ క్రమంలో ధోని – విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య తీవ్ర గర్షణ నెలకొంది. విరాట్ కోహ్లీ జెర్సీతో వచ్చిన అభిమానిని.. ధోని అభిమానులు చితకబాదారు. దీంతో ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2016లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ధోని సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ధోనీ తన చిన్నతనం నుండి జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని.. 2011 వరల్డ్ కప్ గెలిచే వరకు అతడి లైఫ్ జర్నీని తెరకెక్కించారు.

ఈ మూవీలో ధోని పాత్రలో బాలీవుడ్ స్టార్, దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఈ మూవీలో అతడి సరసనకి కియారా అద్వానీ, దిశ పటానీలు నటించారు. ఈ చిత్రం అప్పట్లోనే రూ. 216 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. నిజానికి సీఎస్కే – ఆర్సీబీ అభిమానుల మధ్య గతేడాదే గొడవ మొదలైంది. ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 6 మ్యాచ్ లలో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ చేరింది.

Also Read: Campher – 5 wickets: 5 బంతుల్లో 5 వికెట్లు… ఐర్లాండ్ ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర

ఆ తర్వాత చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆ సమయంలో ఆర్సిబి జట్టు ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. దీంతో సీఎస్కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆర్సిబి ని తక్కువ చేస్తూ మాట్లాడాడు. దీంతో ఈ ఇరుజట్ల అభిమానుల మధ్య గొడవ అప్పటి నుండే ప్రారంభమైంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది.

?utm_source=ig_web_copy_link

Related News

Ban On Pakistan: అఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ అద‌ర్స్‌.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్‌

Mitchell Starc: 176.5 కిమీ వేగంతో స్టార్క్ బౌలింగ్‌..షోయ‌బ్ అక్త‌ర్ 22 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Smriti Mandhana Wedding: పెళ్లి చేసుకోబోతున్న లేడీ కోహ్లీ…వ‌రుడు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

IND VS AUS: 26 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..చెమ‌టోడ్చిన టీమిండియా..ఆసీస్ టార్గెట్ ఎంతంటే

IND VS AUS: భారీ వ‌ర్షం, 35 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..Popcorn తింటూ రోహిత్‌, గిల్ రిలాక్స్‌

Big Stories

×