CSK – RCB: తెలుగు సినీ ఇండస్ట్రీలో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల జన్మదినం సందర్భంగా వారి సినిమాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి.. అభిమానుల ఆదరణ పొందాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓ దిగ్గజ క్రికెటర్ వంతు వచ్చింది. అవును.. టీమిండియా మాజీ కెప్టెన్, తలా మహేంద్ర సింగ్ ధోనీ సమయం వచ్చింది.
ధోని మూవీ రీ రిలీజ్:
జులై 7న మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా ” ఎం.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ” చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోలను హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతిలో మాత్రమే ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్ లో మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇక ధోని సినిమాని థియేటర్ లో వీక్షించేందుకు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ విరాట్ కోహ్లీ అభిమాని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} టీం కి సంబంధించిన విరాట్ కోహ్లీ 18 జెర్సీని ధరించి ధోని మూవీని వీక్షించేందుకు వచ్చాడు.
కోహ్లీ అభిమానిని చితకబాదిన ధోని అభిమానులు:
ఈ క్రమంలో ధోని – విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య తీవ్ర గర్షణ నెలకొంది. విరాట్ కోహ్లీ జెర్సీతో వచ్చిన అభిమానిని.. ధోని అభిమానులు చితకబాదారు. దీంతో ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2016లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ధోని సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ధోనీ తన చిన్నతనం నుండి జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని.. 2011 వరల్డ్ కప్ గెలిచే వరకు అతడి లైఫ్ జర్నీని తెరకెక్కించారు.
ఈ మూవీలో ధోని పాత్రలో బాలీవుడ్ స్టార్, దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఈ మూవీలో అతడి సరసనకి కియారా అద్వానీ, దిశ పటానీలు నటించారు. ఈ చిత్రం అప్పట్లోనే రూ. 216 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. నిజానికి సీఎస్కే – ఆర్సీబీ అభిమానుల మధ్య గతేడాదే గొడవ మొదలైంది. ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 6 మ్యాచ్ లలో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ చేరింది.
Also Read: Campher – 5 wickets: 5 బంతుల్లో 5 వికెట్లు… ఐర్లాండ్ ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర
ఆ తర్వాత చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆ సమయంలో ఆర్సిబి జట్టు ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. దీంతో సీఎస్కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆర్సిబి ని తక్కువ చేస్తూ మాట్లాడాడు. దీంతో ఈ ఇరుజట్ల అభిమానుల మధ్య గొడవ అప్పటి నుండే ప్రారంభమైంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది.
?utm_source=ig_web_copy_link