RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 20026 Tournament) భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans) జట్లు తలపడ్డాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium, Bengaluru) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 5 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కృనాల్ పాండ్యాకు గాయం అయితే, గ్రౌండ్ లోకి ఓ ఏజ్డ్ లేడీ ఫిజియో బరిలోకి దిగింది. ఆమెనే ట్రీట్మెంట్ అందించింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) యంగ్ లేడీని ఫిజియోథెరపీగా అందించిన రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు.. కృనాల్ పాండ్యాకు ( Krunal Pandya) మాత్రం ముసలమ్మను అప్పగించిందని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదెక్కడు సమన్యాయమని నిలదీస్తున్నారు క్రికెట్ అభిమానులు.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans) మధ్య నిన్న చిన్న స్వామి ( M.Chinnaswamy Stadium, Bengaluru) వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా ( krunal ) బౌలింగ్ చేస్తుండగా అతనికి చిన్నపాటి ఇంజురీ జరిగింది. దీంతో వెంటనే ఫిజియోథెరపిస్ట్ ను రంగంలోకి దింపింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. కోహ్లీకి ట్రీట్మెంట్ అందించిన నవనీత్ గౌతమ్ ( Navneet Gautam) వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఓ 60 ఏళ్ల ముసలమ్మను పంపించారు.
ఆమె కూడా విదేశాలకు చెందిన ఫిజియోథెరపిస్టే. గ్రౌండ్ లోకి వచ్చిన ఆమె కృనాల్ పాండ్యాకు ట్రీట్మెంట్ అందించింది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి ట్రీట్మెంట్ అందించేటప్పుడు నవనీత్ గౌతమ్ లాంటి యంగ్ అమ్మాయిని తీసుకువచ్చారు.. కృనాల్ పాండ్యాకు మాత్రం ముసలమ్మను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లేయర్ల విషయంలో సమన్యాయం పాటించడం లేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ పైన ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది బెంగళూరు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, 205 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రానించింది. ఈ క్రమంలోనే 18.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విక్టరీ అందుకుంది.
🚨 JUST RCB DOING RCB THINGS 🚨
– What’s the point of sending a female physio into such uncomfortable situations? 😭😂 pic.twitter.com/wNrtW9zguN
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 24, 2026