Rinku Singh’s Father Dies: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. టి20 వరల్డ్ కప్ ఆడుతున్న రింకూ సింగ్ తండ్రి మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ ఇవాళ వేకువ జామున మరణించారు. గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ వార్త వినగానే రింకూ సింగ్, మరోసారి టీమిండియాను వదిలి సొంతూరుకు బయలుదేరారు. ఇక రింకూ సింగ్ తండ్రి మరణవార్త బయటకు రాగానే, క్రికెటర్లు, రాజకీయా నాయకులు సంతాపం తెలుపుతున్నారు.
టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ తండ్రి ఇవాళ ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనది ఫోర్త్ స్టేజ్ కావడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అందుకే ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు గత నెల రోజులుగా చికిత్స అందించారు వైద్యులు. ఇటు టి20 వరల్డ్ కప్ ఉండడంతో టీమ్ ఇండియా కోసం బరిలోకి దిగాడు రింకూ సింగ్. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి బాగోగులను కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. అయితే మొన్న దక్షిణాఫ్రికా తో మ్యాచ్ అయిపోయిన తర్వాత తన తండ్రి ఆరోగ్యం విషమించిందని హటాహుటిన ఉత్తరప్రదేశ్ వెళ్లాడు రింకూ సింగ్.
ఈ నేపథ్యంలోనే తన తండ్రితో ఒకరోజు గడిపాడు. ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి జట్టులో చేరాడు రింకూ సింగ్. జట్టులో చేరి ఒక్కరోజు గడవకముందే రింకూ సింగ్ తండ్రి సింగ్ మృతి చెందారు. నిన్న మ్యాచ్ సమయానికి చేరుకోకపోవడంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించింది టీమిండియా యాజమాన్యం. అయినప్పటికీ మరొకరి స్థానంలో ఫీల్డింగ్ అయితే చేశాడు. కానీ ఇంతలోనే తండ్రి మరణించిన వార్త వచ్చింది. దీంతో మళ్లీ హుటాహుటిన తన సొంతూరుకు వెళ్ళాడు రింకూ సింగ్. ఇక ఆయన తండ్రి మరణించిన నేపథ్యంలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తన తండ్రి ఖచంద్ర సింగ్ మరణించిన నేపథ్యంలో రింకూ సింగ్ పెళ్లి కూడా వాయిదా పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రింకూ సింగ్ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఎవరైనా చనిపోతే ఏడాది కాలం పాటు ఎలాంటి శుభకార్యాలు ఇంట్లో నిర్వహించబోరని సమాచారం అందుతోంది. దీంతో రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి కార్యక్రమం వచ్చే ఏడాది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా జూన్ 2026 లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఇంతలోనే రింకూ సింగ్ తండ్రి మరణించారు. దీంతో ఈ పెళ్లి కాస్త ఏడాది కాలం పాటు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. 2025 జూన్ 8వ తేదీన ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకునే సమయానికి ఈ పెను విషాదం చోటుచేసుకుంది.
Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచలనం !
రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ర సింగ్
కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధ పడుతున్న ఖంచంద్ర సింగ్
ఇటీవల ఆరోగ్యం బాగా క్షీణించడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్న… pic.twitter.com/eFmMq8CnkB
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2026