E-Paper
Advertisement

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌కు వాళ్లిద్దరూ ఓకే..

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌కు వాళ్లిద్దరూ ఓకే..
Advertisement

T20 World Cup 2024: ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లందరి ఆటతీరును టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అమితంగా ఇష్టపడే ఇద్దరు ఆటగాళ్లు టీ 20 ప్రపంచ కప్ కు దాదాపు కన్ ఫర్మ్ అయిపోయినట్టే అంటున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లఖ్ నవ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇద్దరి ఆట తీరు అందరినీ అమితంగా ఆకట్టుకుంది. వారిలో ఒకరు కులదీప్ యాదవ్ అయితే మరొకరు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ గా చెప్పుకోవాలి.

Advertisement

ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన లఖ్ నవ్ 20 ఓవర్లలో పడుతూ లేస్తూ 167 పరుగులు చేసింది. వీళ్లింత తక్కువ స్కోరు చేయడానికి కులదీప్ యాదవ్ ప్రధాన కారణంగా చెప్పాలి. గాయం కారణంగా దీని ముందు రెండు మ్యాచ్ లు ఆడని కులదీప్ జట్టులోకి రాగానే ధనాధన్ రెండు వికెట్లు వరుస బంతుల్లో తీసి శభాష్ అనిపించాడు. అందులో నికోలస్ పూరన్ కి వేసిన బాల్ అయితే అద్భుతమని చెప్పాలి.

నిజానికి తను వేసిన బాల్ వికెట్లను పడగొట్టడమే కాదు, ఆ వేగానికి వికెట్ సగం విరిగిపోయింది. అంటే తను వేసిన బంతిలో ఎంత వేగం ఉందో గమనించవచ్చు. అలా తను వికెట్లు తీసేసరికి మిగిలిన బౌలర్లు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు.

Advertisement

Also Read: అందరూ బాదుడే.. కానీ వీరిలో దినేశ్ బెస్ట్

ఇకపోతే లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయం సాధించింది. ఇందులో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్లీ పూర్వపు ఫామ్ అందుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫొర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచుల్లో 194 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 157.72 తో ఉన్నాడు.

అటు కులదీప్, ఇటు రిషబ్ పంత్ టీ 20 ప్రపంచకప్ లోకి ఉన్నట్టేనని అందరూ లెక్కలేస్తున్నారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×