E-Paper
Advertisement

India vs Bangladesh: నా లాగే క్యాచ్ మిస్.. రోహిత్ శర్మ అదిరిపోయే రియాక్షన్!

India vs Bangladesh: నా లాగే క్యాచ్ మిస్.. రోహిత్ శర్మ అదిరిపోయే రియాక్షన్!
Advertisement

India vs Bangladesh: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తమ వేటను విజయంతో మొదలుపెట్టింది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కంఫర్టబుల్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ని 228 పరుగులకు అలౌట్ చేశారు భారత బౌలర్లు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో తౌహీద్ హ్రుదియ్ {100} సెంచరీ తో రాణించి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

 

Advertisement

ఇక మరో బ్యాటర్ జాకీర్ అలీ సైతం 68 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ బౌలర్లలో మొహమ్మద్ షమి ఐదు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ మంచి శుభభారంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వేగంగా ఆడాలని ముందే డిసైడ్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నట్లు, పిచ్ బంగ్లా బౌలర్లకు సహకరిస్తున్నట్లు కనిపించింది. ఇక తొలి వికెట్ కి 9.5 ఓవర్స్ లోనే 69 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత విరాట్ కోహ్లీ 22, శ్రేయస్ అయ్యర్ 15, అక్షర్ పటేల్ 8 పరుగులు చేసి నిరాశపరిచారు. ఇక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 41 పరుగులతో నాటౌట్ గా నిలిచి టీమ్ ఇండియాని విజయ తీరాలకు చేర్చాడు. ఇక గిల్ తన సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన హైట్రిక్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్ లో అక్షర్ పటేల్ 9.2, 9.3 బంతులకు తన్ జీత్, ముష్ఫికర్ వికెట్లను పడగొట్టాడు. ఈ రెండు క్యాచ్ లను కీపర్ కే.ఎల్ రాహుల్ మెరుపు వేగంతో పట్టేశాడు.

Advertisement

ఆ తరువాత నాలుగో బంతికి జాకీర్ అలీ కూడా పెవిలియన్ చేరాల్సింది. కానీ స్లిప్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సులువైన క్యాచ్ ని చివరి క్షణంలో వదిలేశాడు. బంతిని వదిలిన రోహిత్ శర్మ తనపై తానే అసహనం వ్యక్తం చేసుకుంటూ చేతిని గ్రౌండ్ కి బాధితు కనిపించాడు. ఆ తరువాత అక్షర పటేల్ కి సారీ చెప్పడం కనిపించింది. అయితే మ్యాచ్ అనంతరం తన తప్పిదం వల్లే అక్షర్ పటేల్ హైట్రిక్ వికెట్ మిస్ అయిందని రోహిత్ శర్మ అంగీకరించాడు. ఈ కారణంగా అక్షర్ పటేల్ ని డిన్నర్ కి తీసుకువెళతానని చెబుతూ నవ్వులు పూయించాడు.

అయితే అది చాలా ఈజీ క్యాచ్ అని, ఆ క్యాచ్ నీ తాను పట్టాల్సింది, ఈ స్థాయి క్రికెట్ లో ఇలాంటి తప్పిదాలు చేయకూడదని, కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత ఇన్నింగ్స్ లో టస్కిన్ అహ్మద్ వేసిన 37వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 37వ ఓవర్ రెండవ బంతిని టస్కిన్ అహ్మద్ ఓవర్ పిచ్డ్ గా వేయగా.. కేఎల్ రాహుల్ దానిని స్క్వేర్ లెగ్ సైడ్ వైపు భారీ షాట్ ఆడాడు.

 

ఇక అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జకీర్ అలీ చేతిలోకి బంతి వచ్చింది. కానీ అతడు బంతిని పట్టుకోలేకపోయాడు. దీంతో కేఎల్ రాహుల్ తో పాటు టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఊపిరి పీల్చుకుంది. అందరికంటే రోహిత్ శర్మ ఎక్కువ సంతోషానికి గురయ్యాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా జకీర్ అలీ ఇచ్చిన క్యాచ్ ని రోహిత్ శర్మ నేలపాలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కేఎల్ రాహుల్ క్యాచ్ ని జాకీర్ అలీ మిస్ చేయడంతో చెల్లుకు చెల్లు అన్నట్లుగా రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీంతో రోహిత్ శర్మ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×