RCB VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల ( Royal Challengers Bangalore vs Gujarat Titans ) మధ్య 14 మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium, Bengaluru ) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. తన పాత జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చుక్కలు చూపించాడు మహమ్మద్ సిరాజ్. ఈ తరుణంలోనే.. ఈ మ్యాచ్లో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తక్కువ స్కోర్ కే పరిమితమైంది.
Also Read: NZ beat Pak: కివీస్ గడ్డపై వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్… పరువు మొత్తం పాయె ?
ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లు వాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore )… 8 వికెట్లు నష్టపోయి… 169 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ల దూకుడుకు 250 కి పైగా పరుగులు చేయాల్సి ఉండేది. కానీ మహమ్మద్ సిరాజ్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పీడ్ కు బ్రేకులు వేశాడు. ఏకంగా ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన మహమ్మద్ సిరాజ్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bangalore కోల్పోకుండా నరకం చూపించాడు.
Also Read: Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
మరోసారి విఫలమైన విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) మరోసారి విఫలమయ్యాడు. ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ) మూడు మ్యాచ్లు ఆడితే… రెండు మ్యాచ్లో కూడా విఫలమయ్యాడు. ఇవాళ ఆరు బంతులు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. మొన్న చెన్నై పై 30 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ బంతులు ఆడినట్లు అతనిపై ట్రోలింగ్ చేశారు. ఇక ఇప్పుడు.. ఏడు పరుగులే చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని ట్రోలింగ్ చేస్తున్నారు.
రెచ్చిపోయిన లియామ్ లివింగ్స్టోన్ ( Liam Livingstone )
ఇవాల్టి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ టాపార్డర్ దారుణంగా విఫలమైంది. దీంతో 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆమాత్రం బెంగళూరు పరుగులు చేసిందంటే దానికి కారణం.. లియామ్ లివింగ్స్టోన్ ( Liam Livingstone ) మాత్రమే అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో 45 బంతులు ఆడి ఏకంగా 54 పరుగులు చేశాడు లియామ్ లివింగ్స్టోన్ ( Liam Livingstone ). ఇందులో 5 సిక్సర్లతో పాటు ఒక బౌండరీ ఉంది. ఇక ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గుజరాత్ విజయం సాధిస్తుంది.