Indian cricketers: ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యంత శక్తివంతమైనది అన్న సంగతి తెలిసిందే. ఐసీసీ ని కూడా ప్రభావితం చేయగలదు మన బీసీసీఐ. దానికి తగ్గట్టుగానే టీమిండియా క్రికెటర్లకు కూడా జీతాలను అందిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి బడా టోర్నమెంట్ నిర్వహించి ఇండియన్ క్రికెటర్లను కోటీశ్వరులను చేస్తోంది. వైభవ్ సూర్య వంశీ లాంటి వాళ్లు కూడా బీసీసీఐ కారణంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే ఇలాంటి క్రమంలో సచిన్ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఖరీదైన ఇండ్లను కలిగి ఉన్న క్రికెటర్లను ఒకసారి పరిశీలిద్దాం.
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) ముంబైలో ( Mumbai) నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇతని ఇంటి విలువ రూ. 80 కోట్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ.100 కోట్లు అని చెప్పవచ్చు. ముంబై నడిబొడ్డున సచిన్ టెండూల్కర్ ఇల్లు ఉన్న నేపథ్యంలో ఇంత ధర పలుకుతోంది. అటు విరాట్ కోహ్లీ కూడా ముంబైలో ఇంటిని కలిగి ఉన్నాడు. ముంబైలోని వర్లీలో ఉన్న విరాట్ కోహ్లీ ఇంటి వ్యాల్యూ 34 కోట్లు. దాంతోపాటు ఆలీ బాగ్ లో 19 కోట్ల విలువైన ఫామ్ హౌస్ కూడా కోహ్లీకి ఉంది.
మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni) రాంచీ లోనే ( Ranchi) ఉంటున్నాడు. అతనికి ఆరు కోట్ల విలువైన ఫామ్ హౌస్ రాంచీలో ఉంది. అందులోనే నివాసం కూడా ఉంటున్నాడు. ఈ ఫామ్ హౌస్ మొత్తం 7 ఎకరాలు ఉంటుంది. కైలాసపతి అనే నామకరణాన్ని దీనికి పెట్టాడు. ఇందులో బైక్స్, కార్ల కలెక్షన్ మొత్తం ఉంటుంది. ముంబైలో రోహిత్ శర్మకు రూ. 30 కోట్ల విలువైన ఇల్లు ఉంది. అహుజా టవర్స్ లోని 53వ అంతస్తులో 4 బిహెచ్ కే అపార్ట్మెంట్ రోహిత్ శర్మ కలిగి ఉన్నాడు. అటు యువరాజు సింగ్ కు కూడా ముంబైలో ఇల్లు ఉంది.
దీని వ్యాల్యూ రూ. 64 కోట్లు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా ముంబైలో 30 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉంది. ఇందులో విలాసవంతమైన హోమ్ గేమింగ్ రూమ్ తో పాటు ప్రైవేట్ థియేటర్ కూడా ఉంటుంది. జిమ్ తో కూడిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఉంటున్నాడు. అటు బిజెపి పార్టీకి దగ్గరైన రవీంద్ర జడేజా జామ్నగర్ లో ఉంటున్నాడు. అతని రాజభవనం ధర 10 కోట్లు ఉంటుంది. ఇది గుజరాత్ లోని జాంనగర్ లో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు అంతస్తుల సంప్రదాయ రాజ భవనం లాంటి ఇంట్లో జడేజా నివసిస్తున్నాడు.