Aakash Chopra On Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami) రీ-ఎంట్రీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా హైయెస్ట్ వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచిన మహమ్మద్ షమీ, టీమిండియాలో స్థానం కోల్పోయి.. రీ ఎంట్రీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవాళితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించినప్పటికీ, మహమ్మద్ షమీని మాత్రం పట్టించుకోవడం లేదు టీమిండియా సెలక్షన్ కమిటీ. ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ షమీకి అండగా నిలిచారు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra). రోహిత్ శర్మ ( Rohit shar ma) అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli) లాంటి 40 ఏళ్ల క్రికెటర్లలో టీమిండియాలోకి ( Team India) తీసుకున్నప్పుడు… మహమ్మద్ షమీని ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. మహమ్మద్ షమీ కంటే రోహిత్, కోహ్లీ ఇద్దరు పెద్ద పోటుగాళ్లా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మహమ్మద్ షమీని ఉగ్రవాదిలా చూడడం మానేయాలని కోరారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని వయస్సు కారణంగా పక్కకు పెట్టడంపై ఆకాశ్ చోప్రా (Aakash Chopra) అసంతృప్తి వ్యక్తం చేశారు. టాలెంట్ ఉన్నవాళ్ళకు టీమిండియాలో అవకాశం ఇవ్వాలి తప్ప.. వయస్సును చూసి ఇవ్వకూడదని గౌతమ్ గంభీర్ కు కౌంటర్ ఇచ్చారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ టీమిండియాలో అద్భుతంగా అవకాశాలు దక్కించుకుంటున్నారని.. షమీ కంటే ఈ ఇద్దరు ఏజ్ లో పెద్దవారని గుర్తు చేశారు. 40 సంవత్సరాలు ఉన్నాయి రోకో.. టీమిండియాలో స్థానం దక్కించుకున్నప్పుడు ? మహమ్మద్ షమీని ఎవరు అడ్డుకుంటున్నారు ? అంటూ నిలదీశారు. ఓ ఉగ్రవాదుల అతడిని ట్రీట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
36 సంవత్సరాలు ఉన్న మహమ్మద్ షమీ.. టి20 లు, దేశవాళీ, ఐపీఎల్ ఎక్కడైనా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు ఆకాశ్ చోప్రా. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మిచెల్ స్టార్క్ కూడా ఏజ్ బార్ అయిన బౌలరే… అయినప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి అవకాశాలు ఇచ్చి, సత్ఫలితాలు రాబడుతోందని గౌతమ్ గంభీర్ కు చురకలు అంటించారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహమ్మద్ షమీ లాంటి అనుభవం ఉన్న వాళ్లకు టీం ఇండియాలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత వీళ్ళందరూ రిటైర్మెంట్ ఇచ్చే ఆటగాళ్లని స్పష్టం చేశారు. ఇకనైనా మహమ్మద్ షమీని టీమిండియాలోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) డిమాండ్ చేశారు.