Saiyaara effect : ప్రస్తుతం క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ఏ ఆటగాడు ఎప్పుడూ బాగా ఉడుతున్నాడో.. ఎప్పుడు విఫలం చెందుతున్నాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అలాగే ఈ టీమ్ మ్యాచ్ ఎప్పుడూ రద్దు అవుతుందో.. ఎప్పుడు ఆ టీమ్ విజయం సాధిస్తుందో.. ఆ ఓటమి చెందుతుందో కూడా ఊహకు కూడా చిక్కడం లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా రేపు 4వ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఆ మ్యాచ్ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమా..? కాదా..? అనేది కూడా క్లారిటీ లేకుండా అందుకే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది.
Also Read : Prithvi Shaw : క్రికెట్ కు గుడ్ బై.. ఫుట్ బాల్ ఆడుతున్న పృథ్వీ షా.. అవకాశాలు రాక దిగజారి మరి !
ఆ సినిమానే కారణమా..?
వాస్తవానికి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే 3 టెస్టు మ్యాచ్ లు ఆడాయి. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్, రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా, మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్లు విజయం సాధించాయి. ఇక నాలుగో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని భారత్.. తాము కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్లు తహతహలాడుతున్నాయి. కానీ ఆ మ్యాచ్ వాయిదా పడిందని ఓ రూమర్ వినిపిస్తోంది. ముఖ్యంగా జులై 23 నుంచి 4వ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఇందుకు “సైయారా” మూవీనే కారణం. జులై 18వ తేదీన విడుదల అయినప్పటికీ.. ఈనెల 23వ తేదీ మ్యాచ్ జరుగుతుంటే.. రేపు మూవీ రిలీజ్ అవుతున్న రేంజ్ లో ఈ సినిమా కి హైప్ పెంచుతున్నారు. ఈ సినిమా కి హైప్ పెంచడానికి కూడా మరో కారణం ఉందండోయ్.. జులై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కూడా హిందీలో రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రానికి హైప్ పెంచుతున్నారు. దక్షిణాది సినిమా అడ్డుకోవాలనే కాన్సెప్ట్ తో ఆ చిత్రానికి హైప్ పెంచడం విశేషం.
ఒక్కరోజు మ్యాచ్ వాయిదా..!
ముఖ్యంగా “సైయారా” మూవీని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ ని ఒక రోజు వాయిదా వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టీమిండియా మాత్రం మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే టీమిండియా సిరీస్ ఆశలు గల్లంతైనట్టే అని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలోనే జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ 9 మ్యాచ్ లు ఆడిన భారత్ 4 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. 5 మ్యాచ్ లు డ్రా కావడం విశేషం. ఇక ఈ సీరిస్ కి ఎడ్జ్ బాస్టన్ లో టీమిండియా ఒక్క విజయం కూడా లేదు. అయినా రెండో టెస్టులో అక్కడ విజయం సాధించింది. దానిని స్పూర్తిగా తీసుకొని టీమిండియా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 4వ టెస్ట్ వాయిదా అనే వార్త సోషల్ మీడియాలో వినిపించడం గమనార్హం. అయితే వాస్తవానికి మ్యాచ్ మాత్రం వాయిదా ఏమి పడటం లేదు. కానీ సోషల్ మీడియా ఈ గాసిప్ ని తెగ వైరల్ చేయడం విశేషం.