Salman Butt: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. మార్చి 8వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand, Final )
మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది. అయితే మ్యాచ్ పూర్తయి దాదాపు పది రోజులు కావస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ( Salman Butt) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బతుకురా, సంజుపై గిల్ కుట్రలు..ఫోటో మార్ఫింగ్ చేసి మరీ!
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధించడం పై పాకిస్తాన్ మొదటి నుంచి విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అందరూ ఈ మ్యాచ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొండాట ఆడి టీమిండియా గెలిచిందని పదేపదే చెబుతున్నారు. ఇండియాకు అనుకూలంగా పిచ్ లు రెడీ చేసి , టైటిల్ గెలిచారని ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఫిక్సింగ్ ( Match Fixing) జరిగిందని ఆరోపణలు చేశాడు.
న్యూజిలాండ్ ప్లేయర్లు అమ్ముడుపోయారని.. అందుకే టీమిండియా ఫైనల్ లో అవలీలగా విజయం సాధించిందని బాంబు పేల్చాడు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ ప్లేయర్ల ముఖాన గోల్డ్ బిస్కెట్లు కొట్టారని బిసిసిఐని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ బాస్ జై షా దగ్గరుండి ఈ టీం ఇండియన్ గెలిపించాడని.. అతని భయానికి న్యూజిలాండ్ ప్లేయర్లు లొంగిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే టీమిండియా టైటిల్ గెలిచేది కాదని ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా లాంటి జట్లు ఫైనల్ కు వస్తే పరిస్థితి వేరే లాగా ఉండేదని బాంబు పెంచారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చాలా చిన్నది కాబట్టి.. అమ్ముడుపోయిందని విమర్శలు చేశారు. దీంతో మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది టీమిండియా. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2007 సంవత్సరంలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో తొలిసారిగా ఛాంపియన్ అయింది టీమిండియా. ఇక 2024 లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరొకసారి చాంపియన్ అయిన టీమిండియా.. లేటెస్ట్ గా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరోసారి టైటిల్ అందుకుంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==